స్టేజి ఎక్కడైనా సందర్భం ఎప్పుడైనా నిర్మాత ఎస్కెఎన్ స్పీచులు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాసలతో కూడిన పంచులు వేయడంలో ఇతని స్పెషాలిటీ వేరు. మెగాస్టార్ చిరంజీవినే ఇలాంటి కౌంటర్లతో మెప్పించడం తనకే చెల్లింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన టిడిపి జనసేన బిజెపి కూటమి విజయోత్సవ వేడుకలో మరోసారి తనదైన బాణీలో చెలరేగిపోయారు. అప్పట్లో అన్నయ్య దండం పెడితే ఇప్పుడు తమ్ముడు పిండం పెట్టాడంటూ వేసిన చమక్కు ఓ రేంజ్ లో పేలింది. సంస్కారం చేతకాని వాళ్లకు ప్రజలు ఇలాంటి తిరస్కారం ఇస్తారని వైసిపిని ఉద్దేశించి అన్నారు.
ఈ దండం పిండం వెనుక ఫ్లాష్ బ్యాక్ తెలిసిందేగా. మాజీ సీఎం జగన్ పాలనలో టాలీవుడ్ పెద్దలంతా తాడేపల్లిగూడెం వెళ్లి విన్నపాలు చేసినప్పుడు చిరంజీవి చేతులెత్తి దండం పెట్టి మరీ తమ సమస్యలని పరిగణించమని కోరారు. దాని జగన్ నవ్వుతూ తలూపారు తప్పించి అలా చేయకండి మీరు పెద్దవారు అనే మాట అనలేదు. పైగా లోపల రూమ్ లో జరిగిన సమావేశం వీడియోని ఉద్దేశపూర్వకంగా బయటికి వదిలారని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ దీనికి బదులు ఉంటుందని కూడా అన్నారు.
ఇదంతా దృష్టిలో ఉంచుకునే ఎస్కెఎన్ తన ప్రసంగంలో ఎలివేషన్లు ఇచ్చారు. జనసేన కోసం పిఠాపురంలో విస్తృతంగా పని చేసిన ఎస్కెఎన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా ఎదురయ్యే కామెంట్లకు, ట్రోల్స్ కు సైతం సమాధానం ఇచ్చేవారు. ఓడిపోయిన గత అధికార పక్షాన్ని ఇంత పబ్లిక్ గా ఓపెన్ గా ఇలా కామెంట్ చేసిన సందర్భాలు టాలీవుడ్ లో తక్కువే. అదేంటో కానీ కూటమి అధికారంలోకి రాగానే అందరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. పైగా టాలీవుడ్ కు ఇకపై జరిగేదంతా శుభమే అనే రీతిలో ఒకరకమైన ఆనందకర వాతావరణం ఇండస్ట్రీలో కనిపిస్తోంది.
This post was last modified on June 24, 2024 9:47 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…