ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ఒక్క రోజు ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ జీవితాంతం రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మిత్రుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెళ్లాను తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని బన్నీ వివరణ ఇచ్చుకున్నా సరే.. అది మెగా అభిమానుల్లో చాలామందికి రుచించలేదు.
ఓవైపు వైసీపీ మీద పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా అండగా నిలబడి పిఠాపురానికి వెళ్లి ప్రచారం కూడా చేస్తే.. బన్నీ అదే టైంలో వెళ్లి నంద్యాలలో శిల్పా రవి కోసం క్యాంపైనింగ్ చేయడాన్ని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. బన్నీ ఈ పని చేసి నెల రోజులు దాటినా కూడా వ్యవహారం సద్దుమణగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత రెచ్చిపోయి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. బన్నీని సోషల్ మీడియా ఖాతాల్లో అన్ఫాలో చేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై బన్నీని ఎంతమాత్రం ఓన్ చేసుకోకూడదని, తన సినిమాలు కూడా చూడకూడదని మెగా ఫ్యాన్స్లో ఓ వర్గం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెరుగుతున్నాయి.
‘పుష్ప-2’ చిత్రాన్ని తాము కొన్ని కారణాల వల్ల కుటుంబంతో కలిసి చూడొద్దని నిర్ణయించుకున్నామంటూ జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కొన్ని టెంప్లేట్ పోస్టులు పెడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకి.. ఒక ట్రెండ్ లాగా మారుతోంది. నిజానికి ‘పుష్ప-2’ను వాయిదా వేయడంలో బన్నీ మీద ప్రస్తుతం నెలకొన్న నెగెటివిటీ కూడా ఒక కారణమని అంటున్నారు. బిజినెస్ మీద బాగా ఎఫెక్ట్ పడేలా ఉండడం కూడా వాయిదా నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందని చెబుతున్నారు. కొన్ని నెలలు గడిస్తే పరిస్థితి మారుతుందని అనుకుంటున్నారు కానీ.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, జనసైనికుల తీరు చూస్తుంటే మాత్రం వాళ్లు ఎప్పుడు బన్నీని క్షమిస్తారన్నది అర్థం కావడం లేదు.
This post was last modified on June 18, 2024 2:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…