ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ఒక్క రోజు ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ జీవితాంతం రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మిత్రుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెళ్లాను తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని బన్నీ వివరణ ఇచ్చుకున్నా సరే.. అది మెగా అభిమానుల్లో చాలామందికి రుచించలేదు.
ఓవైపు వైసీపీ మీద పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా అండగా నిలబడి పిఠాపురానికి వెళ్లి ప్రచారం కూడా చేస్తే.. బన్నీ అదే టైంలో వెళ్లి నంద్యాలలో శిల్పా రవి కోసం క్యాంపైనింగ్ చేయడాన్ని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. బన్నీ ఈ పని చేసి నెల రోజులు దాటినా కూడా వ్యవహారం సద్దుమణగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత రెచ్చిపోయి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. బన్నీని సోషల్ మీడియా ఖాతాల్లో అన్ఫాలో చేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై బన్నీని ఎంతమాత్రం ఓన్ చేసుకోకూడదని, తన సినిమాలు కూడా చూడకూడదని మెగా ఫ్యాన్స్లో ఓ వర్గం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెరుగుతున్నాయి.
‘పుష్ప-2’ చిత్రాన్ని తాము కొన్ని కారణాల వల్ల కుటుంబంతో కలిసి చూడొద్దని నిర్ణయించుకున్నామంటూ జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కొన్ని టెంప్లేట్ పోస్టులు పెడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకి.. ఒక ట్రెండ్ లాగా మారుతోంది. నిజానికి ‘పుష్ప-2’ను వాయిదా వేయడంలో బన్నీ మీద ప్రస్తుతం నెలకొన్న నెగెటివిటీ కూడా ఒక కారణమని అంటున్నారు. బిజినెస్ మీద బాగా ఎఫెక్ట్ పడేలా ఉండడం కూడా వాయిదా నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందని చెబుతున్నారు. కొన్ని నెలలు గడిస్తే పరిస్థితి మారుతుందని అనుకుంటున్నారు కానీ.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, జనసైనికుల తీరు చూస్తుంటే మాత్రం వాళ్లు ఎప్పుడు బన్నీని క్షమిస్తారన్నది అర్థం కావడం లేదు.
This post was last modified on June 18, 2024 2:35 pm
ఎన్నికల్లో గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం సహజమే కానీ ఇటీవలే జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలు, వాటి ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.…
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సినిమాలకు గుర్తింపు ఇచ్చే అవార్డుగా పేరున్న ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్న…
కూటమి సర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల సమయంలో సీట్లు దక్కని నాయకులు, సీట్లు…
ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. అమరావతికి ఢోకాలేదు. పనులు కూడా వేగంగా జరుగుతాయి.…
నిన్న విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఊహించని విధంగా అటు తమిళంలోనూ అసంతృప్తి చెలరేగడం…
అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల…