మళ్లీ తామే అధికారంలో వస్తామనే అతి విశ్వాసంతో జగన్ ఎన్నో అరాచకాలు చేశారనే విమర్శలున్నాయి. అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కానీ ఓట్లతో జనం కొట్టిన చావుదెబ్బకు జగన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. వైసీపీ పాతాళానికి పడిపోయింది. ఎన్నికల ఫలితాలతో ఎలాగో పరువు పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లి మరింత అవమానం పొందడం కంటే కూడా వెళ్లకుండా ఉండటమే మేలని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే అసెంబ్లీ బహిష్కరణకు జగన్ పిలుపునిస్తారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు గెలుచుకోవడంతో శాసనసభలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తనను అవమానిస్తారని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. సాధారణంగా అయితే గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుణ్ని ఎన్నుకుంటారు. కానీ జగన్ ఇప్పటివరకూ ఆ ఆలోచన చేయడం లేదు. అంతే కాకుండా ఈ నెల 22న పార్టీ విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
దీంతో ఈ సమావేశంలో అసెంబ్లీని బహిష్కరించే నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గతంలో కూడా జగన్ ఓ సారి ఇలాగే అసెంబ్లీని బహిష్కరించారు. తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదనేది అసలు ఉద్దేశంగా అప్పుడు కనిపించింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కారణంగా చూపిస్తూ జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా ఇలాగే విస్త్రత స్థాయి సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
This post was last modified on June 18, 2024 2:39 pm
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…