ఈమధ్య సినిమాల్లో కనిపించడం బొత్తిగా తగ్గించేసిన సమంతకు ఆఫర్లు వస్తున్నాయి కానీ తనే ఒకపట్టాన ఒప్పుకోవడం లేదని ఫిలిం నగర్ టాక్. కథ నచ్చకో లేక కాంబో సరిపోకో ఏదైతేనేం చివరికి స్వంతంగా ప్రొడక్షన్ పెట్టేసి మా ఇంటి బంగారంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
చిన్న ప్రీ లుక్ పోస్టర్ లాంటిది ఆ మధ్య వదిలారు కానీ అంతకు మించి డీటెయిల్స్ ఇప్పటిదాకా బయట పెట్టలేదు. వరుణ్ ధావన్ తో చేసిన సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. సరైన సీజన్ చూసి ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ చేయాలనీ అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేసుకుంటోంది.
ఇదిలా ఉండగా సమంతా మలయాళం ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు టాక్. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ థ్రిల్లర్ కి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ జంట గతంలో ఒక కమర్షియల్ యాడ్ చేసింది కానీ తెరమీద కనిపించడం ఇదే మొదటిసారి. తనకు ఏ మాయ చేసావే రూపంలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన గౌతమ్ మీనన్ అంటే సామ్ కు ప్రత్యేక అభిమానం. ఆ కారణంగానే కంటెంట్ లో బలం లేకపోయినా ఎర్ర గులాబీలు క్యామియో చేసింది. అది వచ్చిన సంగతే ఎవరికీ గుర్తు లేనంత ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు చేయబోయే మూవీ మమ్ముట్టి స్వీయ నిర్మాణంలో ఉంటుందని సమాచారం. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టి తక్కువ షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా గౌతమ్ మీనన్ పక్కాగా ప్లాన్ చేశారట. క్రేజీ కలయిక కాబట్టి తెలుగు తమిళంలోనూ వస్తుంది.
ఇక టాలీవుడ్ సంగతికొస్తే 2019లో ఓ బేబీతో సూపర్ హిట్ అందుకున్నాక సమంతకు సరైన సక్సెస్ లేకుండా పోయింది. జాను, శాకుంతలం దారుణంగా పోయాయి. ఖుషి కష్టం మీద గట్టెక్కింది కానీ బెస్ట్ కాలేదు. యశోద ఒకటే కొంచెం ఊరట కలిగించింది. మరి ఇకనైనా స్పీడ్ పెంచుతుందో లేక నిదానమే ప్రధానం సూత్రంతో మెల్లగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.
This post was last modified on June 13, 2024 5:40 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…