Political News

జ‌గ‌న్ గురించి ఇక‌పై నోరెత్త‌ను:  ఆర్ఆర్ఆర్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ పై నిత్యం స‌టైర్ల‌తో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కుడు, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌గ‌న్ గురించి మాట్లాడ‌బోన‌ని అన్నారు. ఆయ‌న‌పై స‌టైర్లు కూడా వేయ‌బోన‌ని తేల్చి చెప్పారు.

“జ‌గ‌న్ గురించి మాట్లాడ‌ను. ఆయ‌నను అనుక‌రించ‌ను. ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్‌“ అని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు మాట్లాడిన వ‌న్నీ జ‌నం నిజ‌మేన‌ని న‌మ్మార‌ని.. అది త‌న‌కు సంతృప్తిని ఇచ్చింద‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్పుడు బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ద‌రిమిలా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే వేస్ట్ ప‌ర్స‌న్‌(జ‌గ‌న్ వైసీపీ నాయ‌కులు) గురించి ఇక నుంచి మాట్లాడ‌బోన‌ని ర‌ఘురామ తేల్చి చెప్పారు. జ‌గ‌న్ చేయాల్సింది చేశాడ‌ని.. ఆయ‌న చేసింది మంచో.. చెడో ఏదో జ‌రిగిపోయింద‌ని ఇక‌, జ‌గ‌న్‌ను కూడా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని తాను భావిస్తున్నాన‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా జ‌గ‌న్ గురించి టైమ్ వేస్టు చేసుకునే ప్ర‌సక్తి ఉండ‌బోద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల దృష్టంగా.. చంద్ర‌బాబు ఆయ‌న ప్ర‌భుత్వంపైనే ఉంద‌న్నారు. దీనిలో త‌న పాత్ర కూడా ఉంటుంద‌న్నారు.

తాము ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామా?  లేదా? అనే విష‌యంపై ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చూస్తున్నార‌ని.. అందుకే.. ఇక నుంచి ప్ర‌భుత్వ విధానాల‌ను తాను మాట్లాడతాన‌ని ర‌ఘురామ తెలిపారు. జ‌గ‌న్ హ‌యాంలో త‌న‌పై పోలీసులు చేసిన టార్చ‌ర్‌ను న్యాయ‌ప‌రంగా.. చ‌ట్టం ప‌రంగా తేల్చుకుంటాన‌ని చెప్పారు.

అందుకే ఆనాటి దాడికి సంబంధించి ఆధారాల‌తో స‌హా పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు.దీనిపై పోలీసులుత‌న‌కు న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని.. లేక పోతే కోర్టులు ఎలానూ ఉన్నాయ‌ని తెలిపారు. ఎక్క‌డో ఒక చోట న్యాయం అయితే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు. 

This post was last modified on June 13, 2024 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago