Political News

జ‌గ‌న్ గురించి ఇక‌పై నోరెత్త‌ను:  ఆర్ఆర్ఆర్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ పై నిత్యం స‌టైర్ల‌తో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కుడు, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌గ‌న్ గురించి మాట్లాడ‌బోన‌ని అన్నారు. ఆయ‌న‌పై స‌టైర్లు కూడా వేయ‌బోన‌ని తేల్చి చెప్పారు.

“జ‌గ‌న్ గురించి మాట్లాడ‌ను. ఆయ‌నను అనుక‌రించ‌ను. ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్‌“ అని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు మాట్లాడిన వ‌న్నీ జ‌నం నిజ‌మేన‌ని న‌మ్మార‌ని.. అది త‌న‌కు సంతృప్తిని ఇచ్చింద‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్పుడు బ‌ల‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ద‌రిమిలా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే వేస్ట్ ప‌ర్స‌న్‌(జ‌గ‌న్ వైసీపీ నాయ‌కులు) గురించి ఇక నుంచి మాట్లాడ‌బోన‌ని ర‌ఘురామ తేల్చి చెప్పారు. జ‌గ‌న్ చేయాల్సింది చేశాడ‌ని.. ఆయ‌న చేసింది మంచో.. చెడో ఏదో జ‌రిగిపోయింద‌ని ఇక‌, జ‌గ‌న్‌ను కూడా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని తాను భావిస్తున్నాన‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా జ‌గ‌న్ గురించి టైమ్ వేస్టు చేసుకునే ప్ర‌సక్తి ఉండ‌బోద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల దృష్టంగా.. చంద్ర‌బాబు ఆయ‌న ప్ర‌భుత్వంపైనే ఉంద‌న్నారు. దీనిలో త‌న పాత్ర కూడా ఉంటుంద‌న్నారు.

తాము ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తామా?  లేదా? అనే విష‌యంపై ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చూస్తున్నార‌ని.. అందుకే.. ఇక నుంచి ప్ర‌భుత్వ విధానాల‌ను తాను మాట్లాడతాన‌ని ర‌ఘురామ తెలిపారు. జ‌గ‌న్ హ‌యాంలో త‌న‌పై పోలీసులు చేసిన టార్చ‌ర్‌ను న్యాయ‌ప‌రంగా.. చ‌ట్టం ప‌రంగా తేల్చుకుంటాన‌ని చెప్పారు.

అందుకే ఆనాటి దాడికి సంబంధించి ఆధారాల‌తో స‌హా పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు.దీనిపై పోలీసులుత‌న‌కు న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని.. లేక పోతే కోర్టులు ఎలానూ ఉన్నాయ‌ని తెలిపారు. ఎక్క‌డో ఒక చోట న్యాయం అయితే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు. 

This post was last modified on June 13, 2024 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

2 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

5 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

6 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

7 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

8 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

9 hours ago