రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో నవదీప్ లవ్ మౌళి ఉంది. సోలో హీరోగా తనకు మార్కెట్ ఎప్పుడో తగ్గినప్పటికీ సరైన కంటెంట్ పడితే నటుడిగా సత్తా చాటుకోవాలని చూస్తున్న తరుణంలో దీని మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్నాక రిలీజ్ కొంత ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఎన్నో తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. కంటెంట్ మీద బలమైన నమ్మకంతో రెండు రోజుల ముందే మీడియాతో పాటు కొందరు ప్రత్యేక ఆహ్వానితులకు హైదరాబాద్ ఆర్కె సినీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. దాన్నుంచి వస్తున్న రిపోర్ట్స్, సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
వాటిలో ప్రధానమైంది రానా స్పెషల్ క్యామియో. అఘోరాగా ఊహించని గెటప్ లో కనిపించేది కాసేపే అయినా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో గుర్తుండిపోతాడట. స్టోరీకి సంబంధించిన ముఖ్యమైన ట్విస్టు తన మీదే ఆధారపడి ఉంటుందని సమాచారం. అదేంటో ఇక్కడ చెప్పేయడం భావ్యం కాదు కాబట్టి స్క్రీన్ మీద చూస్తేనే కిక్. నవదీప్, రానాలకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఆ కారణంగానే అడగ్గానే లవ్ మౌళిలో స్పెషల్ రోల్ ఒప్పుకున్నాడు. కాకపోతే ఈ పాయింట్ ని ఎక్కడ లీక్ కాకుండా టీమ్ ప్రమోషన్ల టైంలో చాలా జాగ్రత్త పడింది. అదే వర్కౌట్ అయ్యేలా ఉంది.
మనమే, సత్యభామ, రక్షణతో పాటు మరో మూడు చిన్న సినిమాలతో పోటీ పడుతున్న లవ్ మౌళికి టాక్ చాలా కీలకం కానుంది. యూత్ ని ఆకట్టుకునేలా దర్శకుడు అవనీంద్ర చాలా అంశాలు పొందుపరిచాడు. ఏకంగా 42 ముద్దు సీన్లు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ధృవ నుంచి రవితేజ ఈగల్ దాక స్టార్ హీరోల సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తున్న నవదీప్ ఇందులో స్క్రీన్ మొత్తం తానై ప్రేమికుడి పాత్రలో కొత్తగా కనిపిస్తాడట. నిజంగా సినిమా ఎలా ఉందనేది రేపు తేలిపోతుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. నవదీప్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో.
This post was last modified on June 6, 2024 11:08 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…