400 స్థానాలలో గెలుపు లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో తలపడ్డ బీజేపీ పార్టీ 240 స్థానాలకు పరిమితం అయింది. ఈ నేపథ్యంలో మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్పూర్లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఇవి ఏర్పాటు చేశారు.
మోదీ సారథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ సాధించని నేపథ్యంలో ఈ హోర్డింగుల పట్ల ప్రాధాన్యం నెలకొన్నది. నాగ్పూర్ నుంచి వరుసగా మూడోసారి నితిన్ గడ్కరీ గెలుపొందారు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు గడ్కరీకి శుభాకాంక్షలు చెప్తూనే ఆయన ప్రధాని కావాలని తమ కోరికను ఈ హోర్డింగుల రూపంలో బయటపెట్టారు.
ఈ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ ఓటమి కోసం మోడీ – షా పావులు కదిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ డిమాండ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. గడ్కరీ అనుకూల ఓట్లు 5 లక్షల వరకు గల్లంతు చేశారని, ఆయనకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారని, ఈ ఎన్నికల్లో మోడీ, షాలు ఎవరూ నాగ్ పూర్ వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గడ్కరీ ప్రధాని కావాలన్న డిమాండ్ పై బీజేపీ ఎలా స్పందిస్తుందో.
మరోవైపు ఇండియా కూటమిలోనూ మహారాష్ట్ర ఫలితాలు కొత్త సమీకరణాలకు తెరతీశాయి. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకుంది. దీంతో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని తమ ఆకాంక్షను బయటపెడుతూ ఆయన అనుచరులు కూడా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ ఇండియా కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
This post was last modified on June 6, 2024 10:26 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…