ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. ‘90వ దశకంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపిన ‘భారతీయుడు’కు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసనే హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకరే రూపొందించాడు. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్కు బ్రేక్ పడి.. రెండేళ్ల విరామానంతరం తిరిగి పట్టాలెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ముందు జూన్లోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఇంకో నెల రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జులై 12న ‘భారతీయుడు’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతుండడం విశేషం.
ఐతే ‘భారతీయుడు-2’ మేకర్స్కు, ‘భారతీయుడు’ రీ రిలీజ్కు ఏ సంబంధం లేదు. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ‘భారతీయుడు’ తీసింది సీనియర్ నిర్మాత ఏఎం రత్నం. సీక్వెల్ రిలీజ్ కాబోతున్న నెల రోజుల ముందు ఈ చిత్రాన్ని అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు రత్నం. జూన్ 7కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఓ వారం పది రోజులైనా సినిమాను నడిపించాలని చూస్తున్నారు.
‘భారతీయుడు-2’ ప్రాపర్ సీక్వెల్ కావడంతో మొదట సినిమాను ఒకసారి థియేటర్లలో దర్శించి ఆ తర్వాత సీక్వెల్కు వెళ్లడం ప్రేక్షకులకు బాగానే ఉంటుంది. కాకపోతే కల్ట్ మూవీ అయిన ‘భారతీయుడు’ను చూశాక పెరిగే అంచనాలను సీక్వెల్ అందుకోవడం కష్టమే. చాలా ఏళ్లుగా తన సినిమాలేవీ సరిగా ఆడక, ‘హరి హర వీరమల్లు’ ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు రత్నం. ఇటీవలే ఆయన ‘గిల్లి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదాయం వచ్చింది. అలాగే ‘ఇండియన్’ రీ రిలీజ్తోనూ నాలుగు కాసులు వెనుకేసుకోవాలని ఆయన భావిస్తుండొచ్చు.
This post was last modified on May 26, 2024 6:44 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…