ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. ‘90వ దశకంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపిన ‘భారతీయుడు’కు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసనే హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకరే రూపొందించాడు. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్కు బ్రేక్ పడి.. రెండేళ్ల విరామానంతరం తిరిగి పట్టాలెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ముందు జూన్లోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఇంకో నెల రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జులై 12న ‘భారతీయుడు’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతుండడం విశేషం.
ఐతే ‘భారతీయుడు-2’ మేకర్స్కు, ‘భారతీయుడు’ రీ రిలీజ్కు ఏ సంబంధం లేదు. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ‘భారతీయుడు’ తీసింది సీనియర్ నిర్మాత ఏఎం రత్నం. సీక్వెల్ రిలీజ్ కాబోతున్న నెల రోజుల ముందు ఈ చిత్రాన్ని అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు రత్నం. జూన్ 7కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఓ వారం పది రోజులైనా సినిమాను నడిపించాలని చూస్తున్నారు.
‘భారతీయుడు-2’ ప్రాపర్ సీక్వెల్ కావడంతో మొదట సినిమాను ఒకసారి థియేటర్లలో దర్శించి ఆ తర్వాత సీక్వెల్కు వెళ్లడం ప్రేక్షకులకు బాగానే ఉంటుంది. కాకపోతే కల్ట్ మూవీ అయిన ‘భారతీయుడు’ను చూశాక పెరిగే అంచనాలను సీక్వెల్ అందుకోవడం కష్టమే. చాలా ఏళ్లుగా తన సినిమాలేవీ సరిగా ఆడక, ‘హరి హర వీరమల్లు’ ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు రత్నం. ఇటీవలే ఆయన ‘గిల్లి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదాయం వచ్చింది. అలాగే ‘ఇండియన్’ రీ రిలీజ్తోనూ నాలుగు కాసులు వెనుకేసుకోవాలని ఆయన భావిస్తుండొచ్చు.
This post was last modified on May 26, 2024 6:44 pm
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…