సరైన మాస్ సినిమా కోసం అర్రులు చాచినట్టు ఎదురు చూస్తున్న బాక్సాఫీసుకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద మాములు అంచనాలు లేవు. విశ్వక్ సేన్ మొదటిసారి పక్కా పల్లెటూరి గెటప్ లోకి మారిపోగా రౌడీ ఫెలోతో ఆకట్టుకుని చల్ మోహనరంగాతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు కృష్ణ చైతన్య తిరిగి తన బలమైన సీరియస్ జానర్ కు వచ్చేశాడు. నేహా శెట్టి హీరోయిన్ కాగా అంజలి మరో ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ హైదరాబాద్ దేవి థియేటర్లో ట్రైలర్ లాంచ్ చేశారు. కథ గురించి అవగాహన వచ్చేలా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల వీడియోని ఆవిష్కరించారు.
పచ్చని ప్రశాంతమైన గోదావరి ప్రాంతంలో లంకల రత్నాకర్(విశ్వక్ సేన్) ది దూకుడు మనస్తత్వం. ఎవడు అడ్డు తగిలినా కొట్టేసే రకం. రాజకీయాల్లోకి రావాలని మహా కోరికగా ఉంటుంది. అనుకోవడమే ఆలస్యం రంగంలోకి దిగుతాడు. బుజ్జి(నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎన్నికల్లో నిలబడి గెలుపు చూడాలని కలలు కన్న రత్నంకు కొత్త ప్రత్యర్థులు పుట్టుకొస్తారు. కత్తి పట్టుకుని నరకడం మొదలుపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి కుటుంబమే ఆపదలో పడుతుంది. ఆడాళ్ళు మగాళ్లు కాకుండా మనుషుల్లో మూడో రకమే పొలిటికల్ లీడర్లని నమ్మే రత్నం చివరికి ఏం చేశాడనేది తెరమీద చూడాలి.
చాలా ఇంటెన్స్ తో దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ అఫ్ గోదావరిని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. అందమైన గోదావరి తీరంలో అలజడులు కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పిన మాస్ డైలాగులు పేలేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి ఛాయాగ్రహణం క్వాలిటీ పెంచాయి. మే 31 విడుదల కాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి విశ్వక్ సేన్ గత సినిమా గామికి పూర్తి విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో రావడం విశేషం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ భజే వాయు వేగం, గంగంగణేశాతో పాటు రానుంది.
This post was last modified on May 25, 2024 9:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…