హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికిది అఫీషియల్ గా లాంచ్ కాలేదు. ముందు ఫోటో షూట్, టీజర్ తీసి వాటి ద్వారా మీడియాకు, అభిమానులకు చెప్పాలనుకున్నారు. నిన్నటిదాకా జరిగింది ఇదే. కానీ అనూహ్యంగా ఇప్పుడిది హోల్డ్ లో పెట్టారని, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పేర్కొంటూ ముంబై మీడియాలో కథనాలు రావడం సంచలనం రేపుతోంది. ఇటు డైరెక్టర్ తరఫున వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని అనుకున్నట్టుగానే జరుగుతుందని చెబుతున్నాయి.
ఏదో రైటో వెంటనే తేలకపోవచ్చు. హనుమాన్ చూశాక రణ్వీర్ ఒక్కసారిగా స్పెల్ బౌండ్ అయిపోయి ప్రశాంత్ వర్మకు ఫ్యాన్ గా మారాడు. దానికి తగ్గట్టే ఇతనికి సరిపడా కథ ఉండటంతో పట్టాలు ఎక్కేసింది. బ్రహ్మరాక్షస టైటిల్ కూడా లీకైపోయింది. అసలు అధికారిక ధృవీకరణ లేకుండా ఇంత హైలైట్ అయిన ప్యాన్ ఇండియా సినిమాలు రామాయణం తర్వాత ఇదే. ప్రశాంత్ వర్మ అందుబాటులో లేడు. ముంబై, హైదరాబాద్ మధ్య తిరుగుతూ తెగ బిజీగా ఉన్నాడు. రణ్వీర్ సింగ్ దీనికన్నా ముందు కమిటైన డాన్ 3, శక్తిమాన్ లను కాదని బ్రహ్మరాక్షసకు ఓటేయడం బట్టే బలమైన కంటెంటని అర్థమవుతోంది.
హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ జనాలకు ఇదంతా అయోమయానికి గురి చేస్తోంది. మరో టాక్ ఏంటంటే బ్రహ్మరాక్షసను సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా కాకుండా విడిగా తీయమని రణ్వీర్ కోరాడట. దానికి ప్రశాంత్ వర్మ అంగీకరించలేదని అంటున్నారు. నిర్ధారణగా చెప్పలేని విషయమే అయినా నిప్పులేనిదే పొగరాదు తరహాలో ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ అయితే జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు ఇది కనక పెండింగ్ పడితే జై హనుమాన్ పనులు ఊపందుకోవచ్చు. దానికి క్యాస్టింగ్ ని ఎంచుకోవడమే ప్రశాంత్ వర్మకు సవాల్ కానుంది.
This post was last modified on May 21, 2024 10:57 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…