తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగల్ స్క్రీన్లను మూసేయాలనే నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. సరైన సినిమాలు లేకపోవడం, ఐపీఎల్ సీజన్, ఎన్నికల వేడి వల్ల ప్రేక్షకులు రావడం తగ్గించేశారని, దీని వల్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని థియేటర్ల అసోసియేషన్ పేర్కొంది. ఈ శుక్రవారంతో మొదలుపెట్టి మే 30 దాకా ఇది అమలులో ఉంటుంది. ఖచ్చితంగా పాటించాలనే రూల్ లేకపోయినా అధిక శాతం స్వచ్చందంగా ఇందులో పాలు పంచుకుంటారని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు అంటున్నాయి. అసలు ముప్పు ముందుంది.
ఒకరకంగా చెప్పాలంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు జారీ చేసే తరహాలో దీన్ని మొదటి హెచ్చరికగా తీసుకోవాలి. బహుళ అంతస్థుల భవనంలో ఎక్కడో నాలుగో అయిదో ఫ్లోర్ లో పెట్టే మల్టీప్లెక్సుల కన్నా సింగల్ స్క్రీన్ల మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎందుకంటే భూమి విలువ, దాని మీద వచ్చే ఆదాయం లెక్కలో చూసుకుంటే యజమానులు నష్టాలను భరిస్తూ కేవలం ప్యాషన్ మీద వీటిని కొనసాగిస్తూ ఉంటారు. మొత్తంగా పడగొట్టి ఏ కల్యాణ మండపంగానో లేదా షాపింగ్ మాల్ గానో మారిస్తే లక్షల స్థానంలో కొన్ని కోట్ల రూపాయలు కళ్లజూసే అవకాశం ఉంటుంది. అయినా సరే చలించని వారు ఎందరో.
ఇప్పుడీ పరిణామం ఎగ్జిబిటర్లను ఆలోచనలో పడేస్తుంది. మానసిక సంతృప్తి తప్ప ఆర్థిక లబ్ది లేని సింగల్ స్క్రీన్లను నడపడం వల్ల తమ కుటుంబాల్లోని తర్వాతి తరాలకు భారీ ఆస్తులు ఇవ్వలేకపోతున్నామనే అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ఇదే జరిగితే అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడమో చేస్తారు. రెంటల్ పద్ధతిలో నిర్మాతలు ఇచ్చే అద్దెలు సైతం పెరిగిన ధరలకు అనుగుణంగా లేవు. ఒకవేళ నెలకు కనీసం ఒక్కటైన స్టార్ హీరో రిలీజ్ ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదేమో కానీ అలా సాధ్యం కాకపోవడం డ్యామేజ్ ని ఇంకా పెంచింది. గణనీయంగా తగ్గిపోయిన ఒంటరి హాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.
This post was last modified on May 15, 2024 4:31 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…