కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ ‘నేను సినిమా రిలీజ్ చేసేస్తా… చేసేస్తా’ నంటూ తొందర పడిపోయాడు బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నొలాన్. తన సినిమా ‘టెనెట్’ చూడ్డానికి కరోనాను లెక్క చేయకుండా జనం వచ్చేస్తారని నొలాన్ కాన్ఫిడెన్స్. అందుకే పరిస్థితులు బేరీజు వేసుకోకుండా టెనెట్ థియేటర్లలో విడుదల చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి యుఎస్లో దారుణ పరాభవం ఎదురయింది.
అక్కడ కేవలం ముప్పయ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనినిబట్టి కరోనా టైమ్లో థియేటర్లకు వెళ్లడానికి జనం ఎంత జంకుతున్నారనేది తేటతెల్లమయింది. ఇండియాలో కూడా థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకుంటే టెనెట్ పరిస్థితే వస్తుంది. అందులోను తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా కీలకం.
అక్కడ ఇప్పట్లో జనం ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. టెనెట్ రిజల్ట్ చూసిన తర్వాత త్వరలో విడుదల చేద్దామని అనుకున్న పలు హాలీవుడ్ చిత్రాలను కూడా డిసెంబర్కి, వచ్చే వేసవికీ వాయిదా వేసేసారు.
This post was last modified on September 17, 2020 1:35 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…