కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ ‘నేను సినిమా రిలీజ్ చేసేస్తా… చేసేస్తా’ నంటూ తొందర పడిపోయాడు బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నొలాన్. తన సినిమా ‘టెనెట్’ చూడ్డానికి కరోనాను లెక్క చేయకుండా జనం వచ్చేస్తారని నొలాన్ కాన్ఫిడెన్స్. అందుకే పరిస్థితులు బేరీజు వేసుకోకుండా టెనెట్ థియేటర్లలో విడుదల చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి యుఎస్లో దారుణ పరాభవం ఎదురయింది.
అక్కడ కేవలం ముప్పయ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనినిబట్టి కరోనా టైమ్లో థియేటర్లకు వెళ్లడానికి జనం ఎంత జంకుతున్నారనేది తేటతెల్లమయింది. ఇండియాలో కూడా థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకుంటే టెనెట్ పరిస్థితే వస్తుంది. అందులోను తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా కీలకం.
అక్కడ ఇప్పట్లో జనం ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. టెనెట్ రిజల్ట్ చూసిన తర్వాత త్వరలో విడుదల చేద్దామని అనుకున్న పలు హాలీవుడ్ చిత్రాలను కూడా డిసెంబర్కి, వచ్చే వేసవికీ వాయిదా వేసేసారు.
This post was last modified on September 17, 2020 1:35 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…