కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ ‘నేను సినిమా రిలీజ్ చేసేస్తా… చేసేస్తా’ నంటూ తొందర పడిపోయాడు బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నొలాన్. తన సినిమా ‘టెనెట్’ చూడ్డానికి కరోనాను లెక్క చేయకుండా జనం వచ్చేస్తారని నొలాన్ కాన్ఫిడెన్స్. అందుకే పరిస్థితులు బేరీజు వేసుకోకుండా టెనెట్ థియేటర్లలో విడుదల చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి యుఎస్లో దారుణ పరాభవం ఎదురయింది.
అక్కడ కేవలం ముప్పయ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనినిబట్టి కరోనా టైమ్లో థియేటర్లకు వెళ్లడానికి జనం ఎంత జంకుతున్నారనేది తేటతెల్లమయింది. ఇండియాలో కూడా థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకుంటే టెనెట్ పరిస్థితే వస్తుంది. అందులోను తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా కీలకం.
అక్కడ ఇప్పట్లో జనం ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. టెనెట్ రిజల్ట్ చూసిన తర్వాత త్వరలో విడుదల చేద్దామని అనుకున్న పలు హాలీవుడ్ చిత్రాలను కూడా డిసెంబర్కి, వచ్చే వేసవికీ వాయిదా వేసేసారు.
This post was last modified on September 17, 2020 1:35 am
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…
35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…
కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…