కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన దగ్గర్నుంచీ ‘నేను సినిమా రిలీజ్ చేసేస్తా… చేసేస్తా’ నంటూ తొందర పడిపోయాడు బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నొలాన్. తన సినిమా ‘టెనెట్’ చూడ్డానికి కరోనాను లెక్క చేయకుండా జనం వచ్చేస్తారని నొలాన్ కాన్ఫిడెన్స్. అందుకే పరిస్థితులు బేరీజు వేసుకోకుండా టెనెట్ థియేటర్లలో విడుదల చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి యుఎస్లో దారుణ పరాభవం ఎదురయింది.
అక్కడ కేవలం ముప్పయ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనినిబట్టి కరోనా టైమ్లో థియేటర్లకు వెళ్లడానికి జనం ఎంత జంకుతున్నారనేది తేటతెల్లమయింది. ఇండియాలో కూడా థియేటర్లు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకుంటే టెనెట్ పరిస్థితే వస్తుంది. అందులోను తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా కీలకం.
అక్కడ ఇప్పట్లో జనం ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. టెనెట్ రిజల్ట్ చూసిన తర్వాత త్వరలో విడుదల చేద్దామని అనుకున్న పలు హాలీవుడ్ చిత్రాలను కూడా డిసెంబర్కి, వచ్చే వేసవికీ వాయిదా వేసేసారు.
This post was last modified on September 17, 2020 1:35 am
కొన్ని రోజుల కిందట బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా.. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన…
హిందీలోనే కాదు తెలుగుతో సహా ఇతర బాషల ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమా దురంధర్ 2 ది రివెంజ్. మార్చి…
రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం…
దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి ముళ్ల మీద పరిగెత్తుతున్నట్టు ఉంది. ఆల్రెడీ పెద్ది విడుదల తేదీ మార్చి 27 నుంచి ఏప్రిల్…
జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాలను జనసేన అధినేత, ఉప…
పెళ్లికి ముందు సెక్స్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. యువతీ యువకులు .. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని దీనికి అనేక…