లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థ లైకా మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం అభిమానుల్లో అసహనం పెంచుతోంది. కేవలం నలభై రోజుల్లో రిలీజ్ పెట్టుకుని అసలు ప్రమోషన్ల ఊసే లేకుండా మౌనంగా ఉన్న వైనం విస్మయం కలిగిస్తోంది. కొంపదీసి మళ్ళీ వాయిదా పడిందేమోననే అనుమానాలు తలెత్తుతుంటే మే మూడో వారంలో చెన్నై వేదికగా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఉంటుందనే వార్త జోరుగా తిరుగుతోంది. రజని, చరణ్ గెస్టులుగా వస్తారట.
దర్శకుడు శంకర్ ఏ విషయాన్నీ తేల్చకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని ఇండస్ట్రీ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనులు జరుగుతున్నాయని, కొన్ని ప్యాచ్ వర్క్స్ పట్ల పూర్తి సంతృప్తి చెందకపోవడం వల్ల వాటిని సరిచేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇంకోవైపు కమల్ ఫ్యాన్స్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి పబ్లిసిటీ చాలా అవసరమని, ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే తప్ప బజ్ రాదని వాపోతున్నారు. హైప్ లేకపోవడం వల్లే బాలీవుడ్ వెర్షన్ కు ఆశించిన స్థాయిలో రేట్ పలకలేదని వాళ్ళ వాదన. 1996లో ఫస్ట్ పార్ట్ హిందీ డబ్బింగ్ హిందుస్థానీ నార్త్ లో చాలా పెద్ద హిట్టు.
కల్కి 2898 ఏడి జూన్ 27 విడుదలవుతుంది కాబట్టి కేవలం రెండు వారాల గ్యాప్ తో భారతీయుడు 2 సర్దుకోవాల్సి వస్తుంది. ఇంత తక్కువ థియేట్రికల్ రన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే కల్కి వచ్చేనాటికి ఇండియన్ ని పూర్తిగా తీసేస్తారు. హిట్ టాక్ తో నడుస్తున్నా సరే స్క్రీన్ కౌంట్ గణనీయంగా పడిపోతుంది. ఇంకో ఆందోళన కలిగించే విషయం ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన భారతీయుడు 2కి కనీసం ఆ అంశం కూడా పాజిటివ్ గా కనిపించడం లేదు. అసలు ఇంత నిర్లిప్తంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో శంకర్ బృందానికే ఎరుక.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…