డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఇవి తప్పించుకున్న దర్శకులు ఉంటారేమో కానీ నటులు మాత్రం ప్రపంచంలోనే ఉండరు. కాకపోతే ఓటమిని స్వీకరించి అంగీకరించే ధైర్యం అందరికీ సులభం కాదు. అమీర్ ఖాన్ ని ఈ విషయంలో ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఒక కామెడీ షోకి గెస్టుగా వచ్చిన ఈ వర్సటైల్ యాక్టర్ ఇంటర్వ్యూలో భాగంగా లాల్ సింగ్ చద్దా ప్రస్తావన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకున్న ఈ ఎమోషనల్ డ్రామా హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేకన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాని గురించి ఓపెనయ్యాడు.
లాల్ సింగ్ చద్దాలో తన పెర్ఫార్మన్స్ కొంచెం అతిగా అనిపించిన మాట వాస్తవమేనని, పాత్రని అమితంగా ప్రేమించడం వల్ల తాను చేస్తోంది రైటో రాంగో చెక్ చేసుకోలేదని, దాని వల్ల స్క్రీన్ మీద తన నటన కృతకంగా అనిపిస్తే తప్పేం లేదని ఒప్పుకున్నాడు. 3 ఇడియట్స్ లో రాంచో క్యారెక్టర్ కి ఎలాగైతే మురుగదాస్ నుంచి స్ఫూర్తి పొందానో, చద్దాకు కూడా అదే తరహా కొత్తదనాన్ని జోడించబోయే బోల్తా పడ్డానని చెప్పాడు. ఫలితం ఏదున్నా నిర్మాతకు నష్టం రావడం అన్నింటికన్నా బాధ కలిగిస్తుందని అన్నాడు. దీంతో అక్కడికొచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా చప్పట్లతో ప్రశంసించారు.
నేను అతి చేశానని చెప్పడం నిజంగా అమీర్ లాంటి పెద్ద హీరోకు అవసరం లేదు. అయినా సరే ఎలాంటి మొహమాటం పడటం లేదు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ చేస్తున్న ఈ సీనియర్ స్టార్ మరో రెండు సినిమాల్లో క్యామియోలు పోషిస్తున్నాడు. కమర్షియల్ కథల జోలికి వెళ్లే ప్రసక్తే లేదంటున్న అమీర్ తన కో స్టార్స్ షారుఖ్, సల్మాన్ లా టైగర్, పఠాన్ లాంటివి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం ప్రయోగాలకే మొగ్గు చూపుతున్నాడు. అన్నట్టు లాల్ సింగ్ చద్దా ఒక్క తనకే కాదు మన నాగ చైతన్యకు సైతం మర్చిపోలేని బ్యాడ్ బాలీవుడ్ డెబ్యూగా మిగిలిపోయింది.
This post was last modified on May 1, 2024 5:49 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…