డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఇవి తప్పించుకున్న దర్శకులు ఉంటారేమో కానీ నటులు మాత్రం ప్రపంచంలోనే ఉండరు. కాకపోతే ఓటమిని స్వీకరించి అంగీకరించే ధైర్యం అందరికీ సులభం కాదు. అమీర్ ఖాన్ ని ఈ విషయంలో ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఒక కామెడీ షోకి గెస్టుగా వచ్చిన ఈ వర్సటైల్ యాక్టర్ ఇంటర్వ్యూలో భాగంగా లాల్ సింగ్ చద్దా ప్రస్తావన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకున్న ఈ ఎమోషనల్ డ్రామా హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేకన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాని గురించి ఓపెనయ్యాడు.
లాల్ సింగ్ చద్దాలో తన పెర్ఫార్మన్స్ కొంచెం అతిగా అనిపించిన మాట వాస్తవమేనని, పాత్రని అమితంగా ప్రేమించడం వల్ల తాను చేస్తోంది రైటో రాంగో చెక్ చేసుకోలేదని, దాని వల్ల స్క్రీన్ మీద తన నటన కృతకంగా అనిపిస్తే తప్పేం లేదని ఒప్పుకున్నాడు. 3 ఇడియట్స్ లో రాంచో క్యారెక్టర్ కి ఎలాగైతే మురుగదాస్ నుంచి స్ఫూర్తి పొందానో, చద్దాకు కూడా అదే తరహా కొత్తదనాన్ని జోడించబోయే బోల్తా పడ్డానని చెప్పాడు. ఫలితం ఏదున్నా నిర్మాతకు నష్టం రావడం అన్నింటికన్నా బాధ కలిగిస్తుందని అన్నాడు. దీంతో అక్కడికొచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా చప్పట్లతో ప్రశంసించారు.
నేను అతి చేశానని చెప్పడం నిజంగా అమీర్ లాంటి పెద్ద హీరోకు అవసరం లేదు. అయినా సరే ఎలాంటి మొహమాటం పడటం లేదు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ చేస్తున్న ఈ సీనియర్ స్టార్ మరో రెండు సినిమాల్లో క్యామియోలు పోషిస్తున్నాడు. కమర్షియల్ కథల జోలికి వెళ్లే ప్రసక్తే లేదంటున్న అమీర్ తన కో స్టార్స్ షారుఖ్, సల్మాన్ లా టైగర్, పఠాన్ లాంటివి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం ప్రయోగాలకే మొగ్గు చూపుతున్నాడు. అన్నట్టు లాల్ సింగ్ చద్దా ఒక్క తనకే కాదు మన నాగ చైతన్యకు సైతం మర్చిపోలేని బ్యాడ్ బాలీవుడ్ డెబ్యూగా మిగిలిపోయింది.
This post was last modified on May 1, 2024 5:49 pm
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…