పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది కూడా. 2004లో వచ్చిన మల్లీశ్వరి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మూవీ లవర్స్ కి బాగా గుర్తు. ఇరవై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అందులో కామెడీ తాజాగా ఎంటర్ టైన్ చేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మేజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పెళ్లి కానీ ప్రసాద్ గా వెంకటేష్ నటన, హుషారైన కోటి పాటలు, సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ వినోదాన్ని జోడించిన తీరు నవ్వులనే కాదు బాక్సాఫీస్ వద్ద సురేష్ సంస్థకు బోలెడు కాసులు కురిపించాయి.
ఇటీవలే దర్శకుడు విజయ్ భాస్కర్ దీని గురించి ఓపెననయ్యారు. అదేంటో చూద్దాం. మల్లీశ్వరి కథ ఓకే అయ్యాక కోట్ల సంపదకు వారసురాలైన మహారాణి లుక్స్ తో ఉండే హీరోయిన్ కోసం తెగ వెతికారు. కానీ సురేష్ బాబుతో సహా అందరూ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. చివరికి విసుగొచ్చిన టైంలో ఒక యాడ్ లో కత్రినా కైఫ్ ని చూసిన విజయ్ భాస్కర్ ఆమెను రికమండ్ చేశారు. దీంతో ముంబై వెళ్లి ఎంక్వయిరీ చేసి ఎలాగోలా ఒప్పించి హైదరాబాద్ పిలిపించుకుని ఓకే చేశారు. రెమ్యునరేషన్ ఏకంగా 75 లక్షలు డిమాండ్ చేసింది. అప్పటి తెలుగు హీరోయిన్స్ అందులో సగం తీసుకోవడమే గొప్ప.
సరేనని ఒప్పేసుకున్నాక ఆమెతో పాటు స్టాఫ్ ఖర్చులు పాతిక లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలయ్యింది. తీరా చూస్తే కత్రినా కైఫ్ కు ఎక్స్ ప్రెషన్లు సరిగా పలకడం లేదు. డాన్సులు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అయినా సరే కోరి తెచ్చుకున్నాడు కాబట్టి విజయ్ భాస్కర్ నానా తంటాలు పడుతూ ఎలాగోలా ఆమెతో చేయించుకున్నాడు. గాయని సునీత డబ్బింగ్, సాంగ్స్, బీజీఎమ్, క్యాస్టింగ్ ఆవిడ లోపాలను కవర్ చేశాయి. తర్వాత బాలీవుడ్ లో కత్రినా ఎంత మెరుగయ్యిందో చూశాం. ఇప్పుడు మల్లీశ్వరి పెట్టుకుని తదేకంగా కత్రినానే చూస్తే విజయ్ భాస్కర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ట్రై చేయండి.
This post was last modified on April 27, 2024 3:28 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…