టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని అమలు చేస్తామని కూడా చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నెలనెలా రూ.1500, మాతృవందనం కింద రూ.15000 ఎంత మంది ఉన్నా ఇస్తామని చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చంద్రబాబు సూపర్ సిక్స్ ఒక రేంజ్లో అయితే.. ప్రజలపై కనక వర్షం కురిపిస్తోంది.
ఇక, తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘నవరత్నాలు 2.0’ను గమనిస్తే.. సంచలన ప్రకటనలు ఏమీ కనిపించడం లేదు. పైగా.. ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తామని.. వాటిని పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే.. ఒక రకంగా.. ఆయన ప్రత్యేకంగా ఇస్తున్నది ఏమీ కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు జగన్ సర్కారు వస్తే.. ప్రజలకు మేళ్లు పాతవే కొనసాగుతాయి తప్ప.. కొత్తగా వచ్చేవి అంటూ ఏమీ ఉండవు.
ఈ పరిణామమే.. ఆలోచనకు గురిచేస్తోంది. అయితే.. సూపర్ సిక్స్లో మరో కీలక హామీ కూడా.. ఉంది. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్న చంద్రబాబు హామీ కీలకంగా మారింది. కానీ, జగన్ ఇలాంటి సంచలన ఉద్యోగ హామీని ఇవ్వలేక పోయారు. మొత్తంగా చూస్తే.. సూపర్ సిక్స్తో పోలిస్తే.. నవరత్నాలు 2.0 తేలిపోతున్నాయనే చెప్పాలి. ఎంత విశ్వసనీయత ఉన్నా.. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాల నుంచి ఆశించకుండా ఉండరు.
సో.. ఇలా చూసుకున్నప్పుడు.. చంద్రబాబు వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.4000 పింఛను కళ్ల ముందు కనిపిస్తుందన్న ఆశ వారిని ఆదిశగా నడిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 27, 2024 5:36 pm
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…