టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని అమలు చేస్తామని కూడా చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నెలనెలా రూ.1500, మాతృవందనం కింద రూ.15000 ఎంత మంది ఉన్నా ఇస్తామని చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చంద్రబాబు సూపర్ సిక్స్ ఒక రేంజ్లో అయితే.. ప్రజలపై కనక వర్షం కురిపిస్తోంది.
ఇక, తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘నవరత్నాలు 2.0’ను గమనిస్తే.. సంచలన ప్రకటనలు ఏమీ కనిపించడం లేదు. పైగా.. ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తామని.. వాటిని పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే.. ఒక రకంగా.. ఆయన ప్రత్యేకంగా ఇస్తున్నది ఏమీ కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు జగన్ సర్కారు వస్తే.. ప్రజలకు మేళ్లు పాతవే కొనసాగుతాయి తప్ప.. కొత్తగా వచ్చేవి అంటూ ఏమీ ఉండవు.
ఈ పరిణామమే.. ఆలోచనకు గురిచేస్తోంది. అయితే.. సూపర్ సిక్స్లో మరో కీలక హామీ కూడా.. ఉంది. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్న చంద్రబాబు హామీ కీలకంగా మారింది. కానీ, జగన్ ఇలాంటి సంచలన ఉద్యోగ హామీని ఇవ్వలేక పోయారు. మొత్తంగా చూస్తే.. సూపర్ సిక్స్తో పోలిస్తే.. నవరత్నాలు 2.0 తేలిపోతున్నాయనే చెప్పాలి. ఎంత విశ్వసనీయత ఉన్నా.. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాల నుంచి ఆశించకుండా ఉండరు.
సో.. ఇలా చూసుకున్నప్పుడు.. చంద్రబాబు వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.4000 పింఛను కళ్ల ముందు కనిపిస్తుందన్న ఆశ వారిని ఆదిశగా నడిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 27, 2024 5:36 pm
తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు…
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…
గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…