టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని అమలు చేస్తామని కూడా చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నెలనెలా రూ.1500, మాతృవందనం కింద రూ.15000 ఎంత మంది ఉన్నా ఇస్తామని చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చంద్రబాబు సూపర్ సిక్స్ ఒక రేంజ్లో అయితే.. ప్రజలపై కనక వర్షం కురిపిస్తోంది.
ఇక, తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘నవరత్నాలు 2.0’ను గమనిస్తే.. సంచలన ప్రకటనలు ఏమీ కనిపించడం లేదు. పైగా.. ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తామని.. వాటిని పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే.. ఒక రకంగా.. ఆయన ప్రత్యేకంగా ఇస్తున్నది ఏమీ కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు జగన్ సర్కారు వస్తే.. ప్రజలకు మేళ్లు పాతవే కొనసాగుతాయి తప్ప.. కొత్తగా వచ్చేవి అంటూ ఏమీ ఉండవు.
ఈ పరిణామమే.. ఆలోచనకు గురిచేస్తోంది. అయితే.. సూపర్ సిక్స్లో మరో కీలక హామీ కూడా.. ఉంది. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్న చంద్రబాబు హామీ కీలకంగా మారింది. కానీ, జగన్ ఇలాంటి సంచలన ఉద్యోగ హామీని ఇవ్వలేక పోయారు. మొత్తంగా చూస్తే.. సూపర్ సిక్స్తో పోలిస్తే.. నవరత్నాలు 2.0 తేలిపోతున్నాయనే చెప్పాలి. ఎంత విశ్వసనీయత ఉన్నా.. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాల నుంచి ఆశించకుండా ఉండరు.
సో.. ఇలా చూసుకున్నప్పుడు.. చంద్రబాబు వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.4000 పింఛను కళ్ల ముందు కనిపిస్తుందన్న ఆశ వారిని ఆదిశగా నడిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 27, 2024 5:36 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…