సినిమా విడుదల ప్లానింగ్ సమయంలో పోటీ ఎంత ఉందనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఊరికే డేట్ వేసుకున్నామని తొందరపడితే బ్రేక్ ఈవెన్ దేవుడెరుగు కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది. సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న కృష్ణమ్మ ఈ విషయంలో తెలివిగా వ్యవహరించింది. ముందు అధికారికంగా ప్రకటించిన మే 3 నుంచి తప్పుకుని మే 10కి వెళ్లిపోయింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కొరటాల శివ నిర్మాణ భాగస్వామ్యంతో వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందింది. వాయిదా వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి.
మే 3న సుహాస్ ప్రసన్నవదనం మంచి అంచనాలతో రిలీజవుతోంది. దాన్ని పంపిణి చేస్తోంది మైత్రి మేకర్స్. ఇదే సంస్థ కృష్ణమ్మ బాధ్యతలు తీసుకుంది. రెండూ మీడియం రేంజ్ సినిమాలు. కంటెంట్ పరంగా ఎవరి ధీమా వారికున్నా థియేటర్ల దగ్గర ఒకరకమైన స్లంప్ వాతావరణం ఉన్న టైంలో ఇలాంటి క్లాష్ ఎంత మాత్రం సేఫ్ కాదు. పైగా మాడిపోయే ఎండలు, ఐపీఎల్ క్రికెట్, ఎన్నికలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రెండు ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద ఇబ్బందేం కాదు కానీ కృష్ణమ్మకు కాంపిటీషన్ కేవలం ఆ ఒక్క ప్రసన్నవదనంతోనే ఆగిపోలేదు.
అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మీద హైప్ క్రమంగా పెరుగుతోంది. దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. తమన్నా, రాశిఖన్నాలు ప్రధాన పాత్ర పోషించిన బాక్ అరణ్మయి 4 కోసం హారర్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇది డబ్బింగ్ అయినప్పటికీ మాస్ ఆడియన్స్ మద్దతు దొరికే అవకాశాలు కొట్టిపారేయలేం. అసలే సత్యదేవ్ కు సోలో హీరోగా మార్కెట్ తగ్గిపోయింది. తనకోసమే వచ్చే ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ డే ఫిగర్స్ కి వాళ్ళు సరిపోరు. అలా కాకుండా సింగల్ గా రావడం వల్ల మౌతా టాక్ తో జనాన్ని మెల్లగా రప్పించుకోవచ్చు. ఇంటెన్స్ డ్రామాగా రూపొందిన కృష్ణమ్మకు సంగీతం కాలభైరవ.
This post was last modified on April 26, 2024 6:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…