బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెంది మూడు నెలలు దాటింది. ముందు అతడిది ఆత్మహత్యగానే భావించారు. కానీ తర్వాత తర్వాత అనేకానేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిది హత్య అని కొందరు, బాలీవుడ్లో ఓ వర్గం అతడిని ఒత్తిడిలోకి నెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిందని ఇంకొందరు ఆరోపణలు గుప్పించారు. అతడి కేసు విచారణ కూడా పలు మలుపులు తిరిగింది.
కాగా మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే నితీష్ రాణె.. రిపబ్లిక్ టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా సుశాంత్, అతడి మేనేజర్ దిశల మృతికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరివీ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు కావని, అవి హత్యలే అని.. అందుకే తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయని.. ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కూడా కలిసి ఆ ఆధారాలు సమర్పిస్తానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
జూన్ 8న సుశాంత్ మేనేజర్ అయిన దిశ ఆత్మహత్యకు పాల్పడిందని.. కానీ దాని కంటే ముందు ఆమె తనకు ఇష్టం లేకుండా ఒక పార్టీలో పాల్గొందని.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని.. దీని గురించి సుశాంత్కు ఫోన్ చేసిందని.. అతను రియాకు విషయం చెప్పాడని.. ఆమె దిశను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేసి అంతా వివరించడంతో దిశ తన ఫ్లాట్కు వచ్చేసరికి ఓ వ్యక్తి తన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని.. ఆ వ్యక్తే ఆమె మరణానికి కారణం అయ్యాడని నితీష్ రాణె ఆరోపించాడు.
ఇదంతా జరిగిన రోజే రియా.. సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తర్వాత ఐదు రోజులకే సుశాంత్ మరణించాడని, అతడి మృతి వెనుక కూడా కొన్ని శక్తులు పని చేశాయని ఆరోపణ చేశాడు రాణె. సుశాంత్ బాయ్ ఫ్రెండ్ అయిన రోహన్ రాయ్తో తాను మాట్లాడానని.. తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని అతను తనతో చెప్పాడని టీవీ చర్చలో రాణె తెలిపాడు. సీబీఐ అధికారులు వెంటనే రోహన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని రాణె అన్నాడు.
This post was last modified on September 16, 2020 10:42 am
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…