మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సినిమా చేశారు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రమిది.
సొంత బేనర్లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరు డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో చరణ్ రాజీ పడలేదు. ఐతే ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ టైంకి సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు కానీ.. దీని వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు చిరంజీవే స్వయంగా ‘సైరా’ నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘సైరా’ గురించి చిరు మాట్లాడారు. “ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని ఉండేది. ‘సైరా’తో ఆ కోరిక తీరింది. కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా నిలిచింది. మిగతా చోట్ల బాగా ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో ‘రుద్రవీణ’ లాంటి గొప్ప సినిమా చేశాను. చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది” అని చిరు చెప్పారు.
This post was last modified on April 13, 2024 4:37 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…