మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సినిమా చేశారు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రమిది.
సొంత బేనర్లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరు డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో చరణ్ రాజీ పడలేదు. ఐతే ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ టైంకి సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు కానీ.. దీని వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు చిరంజీవే స్వయంగా ‘సైరా’ నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘సైరా’ గురించి చిరు మాట్లాడారు. “ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని ఉండేది. ‘సైరా’తో ఆ కోరిక తీరింది. కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా నిలిచింది. మిగతా చోట్ల బాగా ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో ‘రుద్రవీణ’ లాంటి గొప్ప సినిమా చేశాను. చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది” అని చిరు చెప్పారు.
This post was last modified on April 13, 2024 4:37 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…