మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సినిమా చేశారు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రమిది.
సొంత బేనర్లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరు డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో చరణ్ రాజీ పడలేదు. ఐతే ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ టైంకి సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు కానీ.. దీని వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు చిరంజీవే స్వయంగా ‘సైరా’ నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘సైరా’ గురించి చిరు మాట్లాడారు. “ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని ఉండేది. ‘సైరా’తో ఆ కోరిక తీరింది. కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా నిలిచింది. మిగతా చోట్ల బాగా ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో ‘రుద్రవీణ’ లాంటి గొప్ప సినిమా చేశాను. చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది” అని చిరు చెప్పారు.
This post was last modified on April 13, 2024 4:37 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…