పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్. ఐతే అప్పుడప్పుడూ పవన్కు అనుకూలంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ పవన్ పేరు మాత్రం ఎత్తదు. తాజాగా ఆమె మరోసారి పవన్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మీద పంచ్ వేయడానికి పవన్ టాపిక్ను వాడుకుంది.
ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ను వేదికగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. టెస్లా ఏపీకి రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ మద్దతుదారు టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ ఒక పోస్టు పెట్టాడు.
ఈ ట్వీట్ను కోట్ చేస్తూ పూనమ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. “మరి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. అదేం సమస్య కాదు కదా” అని పూనమ్ కామెంట్ చేసింది. వైసీపీ నాయకులు సంబంధం లేకుండా ప్రతిసారీ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరమీదకి తెస్తుంటారు. ఏపీలో సమస్యల గురించి మాట్లాడితే.. పవన్ పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఏపీ సీఎం జగన్ సహా అందరూ చేసేది ఇదే. ఈ నేపథ్యంలోనే పూనమ్ సెటైరిగ్గా ఈ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on April 12, 2024 4:06 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…