పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్. ఐతే అప్పుడప్పుడూ పవన్కు అనుకూలంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ పవన్ పేరు మాత్రం ఎత్తదు. తాజాగా ఆమె మరోసారి పవన్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మీద పంచ్ వేయడానికి పవన్ టాపిక్ను వాడుకుంది.
ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ను వేదికగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. టెస్లా ఏపీకి రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ మద్దతుదారు టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ ఒక పోస్టు పెట్టాడు.
ఈ ట్వీట్ను కోట్ చేస్తూ పూనమ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. “మరి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. అదేం సమస్య కాదు కదా” అని పూనమ్ కామెంట్ చేసింది. వైసీపీ నాయకులు సంబంధం లేకుండా ప్రతిసారీ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరమీదకి తెస్తుంటారు. ఏపీలో సమస్యల గురించి మాట్లాడితే.. పవన్ పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఏపీ సీఎం జగన్ సహా అందరూ చేసేది ఇదే. ఈ నేపథ్యంలోనే పూనమ్ సెటైరిగ్గా ఈ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…