పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్. ఐతే అప్పుడప్పుడూ పవన్కు అనుకూలంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ పవన్ పేరు మాత్రం ఎత్తదు. తాజాగా ఆమె మరోసారి పవన్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మీద పంచ్ వేయడానికి పవన్ టాపిక్ను వాడుకుంది.
ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ను వేదికగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. టెస్లా ఏపీకి రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ మద్దతుదారు టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ ఒక పోస్టు పెట్టాడు.
ఈ ట్వీట్ను కోట్ చేస్తూ పూనమ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. “మరి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. అదేం సమస్య కాదు కదా” అని పూనమ్ కామెంట్ చేసింది. వైసీపీ నాయకులు సంబంధం లేకుండా ప్రతిసారీ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరమీదకి తెస్తుంటారు. ఏపీలో సమస్యల గురించి మాట్లాడితే.. పవన్ పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఏపీ సీఎం జగన్ సహా అందరూ చేసేది ఇదే. ఈ నేపథ్యంలోనే పూనమ్ సెటైరిగ్గా ఈ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది.
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…