కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోయిన్ల రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాఘవేంద్రరావుకు ఇలాంటి పేరే ఉండేది. శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ల రాత మార్చారాయన. హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించి వాళ్ల కెరీర్కు ఊపు తెస్తారని ఆయనకు పేరుండేది. కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.
‘గబ్బర్ సింగ్’కు ముందు వరకు ‘ఐరెన్ లెగ్’ అని పేరున్న శ్రుతి హాసన్.. ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజ హెగ్డే రాత మార్చేశాడు హరీష్. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజా టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ పుణ్యమా అని ఇంకో హీరోయిన్ దశ తిరిగినట్లు కనిపిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బ్రేక్ ఇచ్చి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రంతో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చాడు హరీష్. మోడల్ టర్న్డ్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ మేకింగ్ టైంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ ఆమెను విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతలోనే మరో మంచి ఛాన్స్ పట్టేసిందట భాగ్యశ్రీ. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రూపొందించబోయే చిత్రంలో కూడా ఆమే హీరోయిన్ అట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…