కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోయిన్ల రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాఘవేంద్రరావుకు ఇలాంటి పేరే ఉండేది. శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ల రాత మార్చారాయన. హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించి వాళ్ల కెరీర్కు ఊపు తెస్తారని ఆయనకు పేరుండేది. కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.
‘గబ్బర్ సింగ్’కు ముందు వరకు ‘ఐరెన్ లెగ్’ అని పేరున్న శ్రుతి హాసన్.. ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజ హెగ్డే రాత మార్చేశాడు హరీష్. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజా టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ పుణ్యమా అని ఇంకో హీరోయిన్ దశ తిరిగినట్లు కనిపిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బ్రేక్ ఇచ్చి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రంతో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చాడు హరీష్. మోడల్ టర్న్డ్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ మేకింగ్ టైంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ ఆమెను విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతలోనే మరో మంచి ఛాన్స్ పట్టేసిందట భాగ్యశ్రీ. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రూపొందించబోయే చిత్రంలో కూడా ఆమే హీరోయిన్ అట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ.
This post was last modified on April 12, 2024 3:54 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…