కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోయిన్ల రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాఘవేంద్రరావుకు ఇలాంటి పేరే ఉండేది. శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ల రాత మార్చారాయన. హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించి వాళ్ల కెరీర్కు ఊపు తెస్తారని ఆయనకు పేరుండేది. కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.
‘గబ్బర్ సింగ్’కు ముందు వరకు ‘ఐరెన్ లెగ్’ అని పేరున్న శ్రుతి హాసన్.. ఈ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజ హెగ్డే రాత మార్చేశాడు హరీష్. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజా టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ పుణ్యమా అని ఇంకో హీరోయిన్ దశ తిరిగినట్లు కనిపిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బ్రేక్ ఇచ్చి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రంతో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చాడు హరీష్. మోడల్ టర్న్డ్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ మేకింగ్ టైంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ ఆమెను విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాకు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతలోనే మరో మంచి ఛాన్స్ పట్టేసిందట భాగ్యశ్రీ. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రూపొందించబోయే చిత్రంలో కూడా ఆమే హీరోయిన్ అట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ చిత్రానికి భాగ్యశ్రీ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ.
This post was last modified on April 12, 2024 3:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…