మహర్షి నుంచి సీరియస్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయి కొంత కాలం కామెడీకి దూరంగా ఉన్న అల్లరి నరేష్ తిరిగి తన పాత స్కూలుకు వచ్చి చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. తండ్రి ఈవివి సత్యనారాయణ ఇచ్చిన ఆల్ టైం క్లాసిక్ టైటిల్ కావడంతో దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మల్లి అంకెం దర్శకత్వం వహించగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. టీజర్ గట్రా ప్రమోషనల్ మెటీరియల్ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఇది మార్చి 22నే విడుదల కావాల్సింది. అయితే ప్రమోషన్, బిజినెస్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడవన్నీ కొలిక్కి వచ్చాయి. ఆ ఒక్కటి అడక్కుకి లైన్ క్లియరయ్యింది కానీ డేట్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ గత నెల ఓం భీమ్ బుష్ తో పాటు వచ్చి ఉంటే మంచి రన్ దక్కే అవకాశం ఉండేది. కానీ తప్పని పరిస్థితుల్లో వదిలేసుకున్నారు. పోనీ ఏప్రిల్ 5 ప్లాన్ చేసుకున్నా సరిపోయేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ మీదున్న ప్రీ రిలీజ్ బజ్ చూసి ఆగిపోయారు. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏప్రిల్ 19. సమయం లేదు కాబట్టి ఇదీ సాధ్యం కాదు. ఏప్రిల్ 25 దిల్ రాజు బ్యానర్ నుంచి లవ్ మీ, విశాల్ రత్నం, తమన్నా అరన్మయి 4 ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మే నెల ఆప్షన్లు కూడా చూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కనక దానికి అనుగుణంగానే తేదీని ప్రకటించలేదు. పైగా కల్కి ఎప్పుడు వస్తుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ ఒక్కటి అడక్కు హిట్ కావడం అల్లరి నరేష్ కు చాలా కీలకం.ఎందుకంటే తిరిగి ఎంటర్ టైన్మెంట్ జానర్ కు రావడం సరైన నిర్ణయమేనని ఋజువు కావాలంటే ఒక పెద్ద హిట్టు పడాలి. నిర్మాణంలో ఉన్న బచ్చల మల్లి కూడా వినోదాన్ని ఆధారంగా చేసుకున్నదే. కామెడీ సినిమాలతో జనాలను నవ్వించడం పెద్ద టాస్క్ గా మారిపోయిన ట్రెండ్ లో కొత్త తరాన్ని మెప్పించడం తన లాంటి హీరోలకు సవాల్ గా మారింది.
This post was last modified on April 11, 2024 10:17 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…