మన తెలుగు నిర్మాతలు కోలీవుడ్ లో పాగా వేయడం మెల్లగా పెరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఏషియన్ తదితర బ్యానర్లు ఇప్పటికే మీడియం, పెద్ద బడ్జెట్ సినిమాలతో జెండాలు పాతడం గత ఏడాది నుంచి వేగం పుంజుకుంది. ఇదే కోవలోకి డివివి దానయ్య కూడా భారీ ప్లాన్ తో స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేయబోయే చివరి కోలీవుడ్ మూవీగా ప్రచారంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీని ఈయనే నిర్మిస్తారని రెండు నెలల క్రితమే ప్రచారం జరిగింది. ఆ వార్తను దానయ్య ఎక్కడా ఖండించలేదు.
దీంతో సహజంగానే ఈ ప్రాజెక్టు ఆన్ లో ఉందనే అనుకున్నారు. తాజాగా వినిపిస్తున్న చెన్నై టాక్ ప్రకారం దానయ్య దీన్ని వదులుకోబోతున్నారట. విజయ్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు తాను చెప్పిన దర్శకుడు, కథతోనే తీయాలని కండీషన్ పెట్టడం వల్ల ఇది వర్కౌట్ కాదని గ్రహించి సైలెంట్ గా తప్పుకునే ప్లాన్ లో ఉన్నారని వినికిడి. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ లేకపోయినప్పటికీ అంతర్గతంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే నిప్పు లేనిదే ఉత్తుత్తినే పొగరాదుగా. సో తెరవెనుక ఏదో జరిగే ఉండొచ్చు.
పొలిటికల్ స్టాండ్ విషయంలో బలంగా ఉన్న విజయ్ తన ఆఖరి మూవీని కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో చేస్తున్నది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇంకో రెండు నెలల్లో గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. హెచ్ వినోత్ కాకుండా పలువురు ఇతర దర్శకులు విజయ్ కు కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ ఏవీ ఒక పట్టాన కొలిక్కి రాలేదు. దానయ్య నిజంగా వదిలేసుకున్నారా లేక ఇదంతా గాసిప్పా అనేది కొంచెం వేచి చూస్తే తేలుతుంది.
This post was last modified on April 11, 2024 10:21 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…