అన్న సినిమాలో త‌మ్ముడికి నో ఛాన్స్

బాలీవుడ్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న ఫ్యామిలీ క‌పూర్‌ల‌ది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వ‌చ్చారు. వారిలో న‌టుడిగా అనిల్ క‌పూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయ‌న సోదరుడు బోనీ క‌పూర్ నిర్మాత‌గా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య మంచి అనుబంధ‌మే ఉంది. ఐతే బోనీ తీయ‌బోయే కొత్త సినిమాలో అనిల్ క‌పూర్ ఛాన్స్ ఇవ్వ‌మంటే మాత్రం ఇవ్వ‌లేద‌ట‌. దీంతో అనిల్ అలిగాడ‌ట‌. ఈ విష‌యాన్ని బోనీనే స్వ‌యంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2

005లో విడుదలైన నో ఎంట్రీ మూవీ అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ట‌యింది. ఇందులో అనిల్ క‌పూర్, స‌ల్మాన్ ఖాన్, బిపాసా బ‌సు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్వించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయ‌డానికి బోనీ రెడీ అయ్యాడు.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంది. నో ఎంట్రీ వ‌చ్చిన 20 ఏళ్ల‌కు, అంటే వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఐతే నో ఎంట్రీ సీక్వెల్ రాబోతోంద‌ని తెలిసి.. తాను కూడా అందులో న‌టిస్తాన‌ని అనిల్ క‌పూర్ ముందుకు వ‌చ్చాడ‌ట‌. ఐతే ఈ సినిమాలో నిన్ను తీసుకోవ‌డానికి ఖాళీ లేద‌ని తేల్చి చెప్పేశాడ‌ట బోనీ క‌పూర్. దీంతో అనిల్ క‌పూర్ అలిగాడ‌ట‌. తాను ఈ విష‌యంలో స‌ర్దిచెబుదామ‌ని అనిల్‌కు కాల్ చేస్తుంటే అత‌ను స్పందించ‌ట్లేద‌ని మీడియాకు వెల్ల‌డించాడు బోనీ.

ఇక ఈ చిత్రంలో త‌న కొడుకు అర్జున్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్, దిల్జిత్ దోసాంజ్ హీరోలుగా న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు బోనీ. ఇందులో ప‌దిమంది హీరోయిన్లు న‌టిస్తార‌ని బోనీ చెప్ప‌డం విశేషం.