స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్ళతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందు వరసలో ఉంటే నటన పరంగా కీర్తిశేషులు హరికృష్ణ తనదైన ముద్రవేయగలిగారు. చైతన్య కృష్ణ ఈ మధ్యే బ్రీత్ అంటూ ఏదో ప్రయత్నం చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన జానకి రామ్ కుటుంబం నుంచి ఆయన పెద్దబ్బాయి తారకరామారావుని పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్. అన్నగారి బొమ్మతోనే తన బ్యానర్ బొమ్మరిల్లుని మొదలుపెట్టిన వైవిఎస్ చౌదరి ఈ బాధ్యతలు తీసుకున్నారట
వైవిఎస్ చౌదరి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా దేవదాసు రూపంలో డెబ్యూ హీరో రామ్ కి సిల్వర్ జూబ్లీ హిట్ ఇచ్చిన దర్శకుడిగా అప్పట్లో పేరు మారుమ్రోగిపోయింది. నటించడం తగ్గించేసిన హరికృష్ణని హీరోగా పెట్టి లాహిరి లాహిరి లాహిరి లాహిరి, సీతయ్యతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకోవడం అభిమానులకు గుర్తే. ఆ తర్వాత చౌదరి ఫామ్ కోల్పోయారు. సాయి తేజ్ రేయ్, రవితేజ నిప్పు లాంటివి భారీ డిజాస్టర్లు కావడంతో దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత జానకిరామ్ అబ్బాయిని పరిచయం చేయడం కోసం ఒక యూత్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం.
అందరూ కొత్తవాళ్లతో వైవిఎస్ చౌదరి తన మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండితోనే మంచి విజయం అందుకున్నారు. సో ఇప్పుడు ఇదేమి రిస్క్ కాదు. కాకపోతే మారిపోయిన ట్రెండ్, అభిరుచులకు అనుగుణంగా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. జానకిరామ్ పెద్దబ్బాయి పేరు తారకరామారావు. ఆల్రెడీ ఆ పేరుతో తారక్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పుతో పరిచయం చేస్తారేమో చూడాలి. అధికారికంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత అఫీషియల్ గా లాంచ్ గురించి చెప్పబోతున్నారు.
This post was last modified on March 26, 2024 11:11 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…