స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్ళతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందు వరసలో ఉంటే నటన పరంగా కీర్తిశేషులు హరికృష్ణ తనదైన ముద్రవేయగలిగారు. చైతన్య కృష్ణ ఈ మధ్యే బ్రీత్ అంటూ ఏదో ప్రయత్నం చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన జానకి రామ్ కుటుంబం నుంచి ఆయన పెద్దబ్బాయి తారకరామారావుని పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని లేటెస్ట్ అప్డేట్. అన్నగారి బొమ్మతోనే తన బ్యానర్ బొమ్మరిల్లుని మొదలుపెట్టిన వైవిఎస్ చౌదరి ఈ బాధ్యతలు తీసుకున్నారట
వైవిఎస్ చౌదరి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా దేవదాసు రూపంలో డెబ్యూ హీరో రామ్ కి సిల్వర్ జూబ్లీ హిట్ ఇచ్చిన దర్శకుడిగా అప్పట్లో పేరు మారుమ్రోగిపోయింది. నటించడం తగ్గించేసిన హరికృష్ణని హీరోగా పెట్టి లాహిరి లాహిరి లాహిరి లాహిరి, సీతయ్యతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకోవడం అభిమానులకు గుర్తే. ఆ తర్వాత చౌదరి ఫామ్ కోల్పోయారు. సాయి తేజ్ రేయ్, రవితేజ నిప్పు లాంటివి భారీ డిజాస్టర్లు కావడంతో దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత జానకిరామ్ అబ్బాయిని పరిచయం చేయడం కోసం ఒక యూత్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం.
అందరూ కొత్తవాళ్లతో వైవిఎస్ చౌదరి తన మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండితోనే మంచి విజయం అందుకున్నారు. సో ఇప్పుడు ఇదేమి రిస్క్ కాదు. కాకపోతే మారిపోయిన ట్రెండ్, అభిరుచులకు అనుగుణంగా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. జానకిరామ్ పెద్దబ్బాయి పేరు తారకరామారావు. ఆల్రెడీ ఆ పేరుతో తారక్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పుతో పరిచయం చేస్తారేమో చూడాలి. అధికారికంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత అఫీషియల్ గా లాంచ్ గురించి చెప్పబోతున్నారు.
This post was last modified on March 26, 2024 11:11 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…