పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త టీజర్ రానుందనే వార్త నిన్నటి నుంచే ఫ్యాన్స్ లో కొత్త ఉద్వేగాన్ని నింపింది. ప్రైమ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా దీన్ని ప్లాన్ చేశారనే టాక్ వచ్చినా మొత్తానికి అభిమానులు కోరుకోని స్పెషల్ సర్ప్రైజ్ దక్కింది. ఎన్నికలు, జనసేన కార్యకలాపాల కోసం షూటింగ్ నుంచి పవన్ బ్రేక్ తీసుకున్నా తీసిన కొంత భాగంలోనే ఊర మాస్ కంటెంట్ రాబట్టుకున్నాడు హరీష్. గతంలో వదిలిన దానికి ఎక్స్ టెన్షన్ లా అనిపించినా అంతకు మించిన మసాలా అయితే దీంట్లోనే కనిపించింది.
కథకు సంబంధించిన క్లూస్ పెద్దగా ఇవ్వలేదు. లక్ష్మి నరసింహస్వామి రథం లాగుతుండగా కొందరు విద్రోహ శక్తులు అరాచకం చేయాలని చూడటం, వాటిని భగత్ సింగ్ అడ్డుకునే వైనం, పాతబస్తీ లాంటి ప్రాంతంలో ముస్లింల మధ్య కొందరు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను కత్తి పట్టుకుని వేటాడ్డం ఇలా పవర్ ఫుల్ విజువల్స్ తో నింపేశారు. గాజు గ్లాసుని చులకనగా మాట్లాడిన గుండాకు వార్నింగ్ ఇస్తూ గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే కనిపించని సైన్యం అంటూ చెప్పే డైలాగుల్లో పొలిటికల్ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఖాకీ, పంచె రెండు గెటప్స్ లో పవన్ ని చూపించాడు.
ఈ లెక్కన తేరి రీమేక్ అయినా సరే గబ్బర్ సింగ్ తరహాలో ఒరిజినల్ ని మించేలా హరీష్ శంకర్ చాలా కీలకమైన మార్పులు చేసినట్టు టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ వీడియోలో చూపించిన ఫైట్ ఎపిసోడ్స్ విజయ్ వెర్షన్ లో లేవు. కొత్తగా రాసుకున్నాడు. ఇదే తరహాలో కేవలం మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని కొత్త ఫీల్ ఇస్తానని హరీష్ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఒక ఫ్రేమ్ లో ఆమెనీ రివీల్ చేశారు. విడుదల తేదీ తేలాలంటే ఎలక్షన్లు అయ్యాకే ఆశించవచ్చు.
This post was last modified on March 19, 2024 5:48 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…