Movie News

సందీప్ కిషన్ తీసుకుంది చిరంజీవి కథే కానీ

ఇటీవలే ఊరిపేరు భైరవకోనతో డీసెంట్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ త్వరలో దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దీనికి కథను అందించాడు. అయితే ఇది గతంలో కళ్యాణ్ కృష్ణ కోసం చిరంజీవికి ఇచ్చిన కథేననే ప్రచారం ముందు నుంచి ఉంది. దానికి నిర్మాత రాజేష్ దండా స్పష్టత ఇచ్చారు. ఇది మలయాళం బ్రో డాడీకి రీమేకనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, పూర్తిగా స్ట్రెయిట్ సబ్జెక్టుతో నిర్మిస్తున్న సినిమాని కుండబద్దలు కొట్టారు.

చిరంజీవి దగ్గరికి వెళ్లిన స్టోరీనే అయినప్పటికీ కొత్త వెర్షన్ రాసుకున్నామని పూర్తిగా వేరే ఫ్లేవర్ లో ఉంటుందని అన్నారు. మ్యాటర్ ఇంకొంచెం బెటర్ గా అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. ప్రసన్నకుమార్ మొదట రాసుకున్న వెర్షన్ లో ఒక సీనియర్ స్టార్, ఒక యూత్ హీరో అవసరం. దానికి అనుగుణంగానే మెగాస్టార్ కాంబోలో సిద్దు జొన్నలగడ్డ లేదా శర్వానంద్ తో ప్లాన్ చేద్దామనుకున్నారు. భోళా శంకర్ తర్వాత చిరు మనసు మారిపోవడంతో డ్రాప్ చేసుకున్నారు. కానీ కంటెంట్ ఉన్న సబ్జెక్టు కావడంతో ప్రసన్న, త్రినాథరావు నక్కిన కలిసి కీలక మార్పులు చేసుకున్నారు.

ఇప్పుడు రావు రమేష్, సందీప్ కిషన్ కలయికలో దీన్ని అందించబోతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవినే తొలుత మెప్పించిన కథ కాబట్టి ఖచ్చితంగా బలమైన పాయింట్ ఉంటుంది. ఒకవేళ భోళా ఫలితం సానుకూలంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసేవారేమో. కానీ జరిగింది వేరు. దీంతో ఇది కాస్తా సందీప్ కిషన్ చేతికి వచ్చింది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ తరహాలో మాస్ క్లాస్ రెండు ఎంటర్ టైన్మెంట్స్ మిక్స్ చేసిన తీరులో ఉంటుందట. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న త్రినాథరావు నక్కినకు దీని సక్సెస్ కీలకం.

This post was last modified on March 18, 2024 4:23 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago