మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వైజాగ్ మండుటెండల్లో కీలక షెడ్యూల్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.వాటిలో ప్రధానమైంది దర్శకుడు శంకర్ కథా నేపధ్యాన్ని ముగ్గురు రాజకీయ విలన్లను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్రలు ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద నడుస్తుందట.
పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ గమనించాల్సి. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి దాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఇతని వారసుడు ఎస్జె సూర్య అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. తనకు నవీన్ చంద్ర కొడుకా లేక తమ్ముడా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. జనం సొమ్మును పీల్చి పిప్పి చేసే ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ ఎలా కట్టడి చేస్తాడనేది ఊహించని స్క్రీన్ ప్లేతో ఉంటుందని వినికిడి.
కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో చాలా డ్రామా ఉంటుందని యూనిట్ టాక్. కియారా అద్వానీ చీరకట్టు అదీ చూస్తుంటే ఏదో కేవలం చరణ్ తో డాన్సులు ఆడి లవ్ చేయడానికే పరిమితం కావడం లేదని అర్థమవుతోంది. అంజలి, జయరాం, సునీల్ పాత్రలకు సైతం మంచి స్కోప్ దక్కిందట. దేశమంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ ఛేంజర్ వచ్చి ఉంటే బాగుండేది కానీ ఆలస్యం భరించక తప్పలేదు. అక్టోబర్ లేదా డిసెంబర్ ఈ రెండు ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్న దిల్ రాజు, శంకర్ లు వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకుని మార్చి 27 ప్రకటించే ఛాన్స్ ఉంది.
This post was last modified on March 16, 2024 7:42 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…