మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వైజాగ్ మండుటెండల్లో కీలక షెడ్యూల్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.వాటిలో ప్రధానమైంది దర్శకుడు శంకర్ కథా నేపధ్యాన్ని ముగ్గురు రాజకీయ విలన్లను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్రలు ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద నడుస్తుందట.
పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ గమనించాల్సి. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి దాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఇతని వారసుడు ఎస్జె సూర్య అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. తనకు నవీన్ చంద్ర కొడుకా లేక తమ్ముడా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. జనం సొమ్మును పీల్చి పిప్పి చేసే ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ ఎలా కట్టడి చేస్తాడనేది ఊహించని స్క్రీన్ ప్లేతో ఉంటుందని వినికిడి.
కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో చాలా డ్రామా ఉంటుందని యూనిట్ టాక్. కియారా అద్వానీ చీరకట్టు అదీ చూస్తుంటే ఏదో కేవలం చరణ్ తో డాన్సులు ఆడి లవ్ చేయడానికే పరిమితం కావడం లేదని అర్థమవుతోంది. అంజలి, జయరాం, సునీల్ పాత్రలకు సైతం మంచి స్కోప్ దక్కిందట. దేశమంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ ఛేంజర్ వచ్చి ఉంటే బాగుండేది కానీ ఆలస్యం భరించక తప్పలేదు. అక్టోబర్ లేదా డిసెంబర్ ఈ రెండు ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్న దిల్ రాజు, శంకర్ లు వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకుని మార్చి 27 ప్రకటించే ఛాన్స్ ఉంది.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…