Movie News

25 సంవత్సరాల దేవి మైలురాళ్ళు

కొన్ని సినిమాలు తీసేటప్పుడు రిస్క్ అనిపించినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. 1999లో విడుదలై ఈ రోజుతో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవి వెనుక పలు ఆసక్తికరమైన సంగతులున్నాయి. అవేంటో చూద్దాం. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు వెంకటేష్ శత్రువు, విజయశాంతి పోలీస్ లాకప్ రెండు వరస సూపర్ హిట్స్ మంచి ఊపుమీదున్న సమయమది. మూడో చిత్రంగా బి గోపాల్ తో స్ట్రీట్ ఫైటర్ 1995 తీస్తే దారుణంగా బోల్తా కొట్టి నష్టాలు తెచ్చి పెట్టింది. స్టార్ పవర్ ఓపెనింగ్స్ తెస్తాయి తప్పించి లాభాలు ఇవ్వవని గుర్తించి మూడేళ్ళ పాటు నిర్మాణానికి దూరంగా ఉన్నారు.

తన బ్యానర్ కు ఆస్థాన దర్శకుడిగా గొప్ప విజయాలు అందించిన కోడి రామకృష్ణతో మరోసారి చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అమ్మోరు చూసి తనకు అలాంటి మైలురాయి మూవీ కావాలని, బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని రిస్కుకి సిద్ధపడ్డారు. గ్రాఫిక్స్ కు భారీ వ్యయం అవుతుంది కాబట్టి క్యాస్టింగ్, సాంకేతిక వర్గం మీద ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదని నిర్ణయించుకుని హీరో హీరోయిన్లగా సిజ్జు, అప్పటికే ఓంకారంతో పాటు కొన్ని సినిమాలు చేసిన కన్నడ నటి ప్రేమను తీసుకున్నారు. కేవలం 19 ఏళ్ళ వయసున్న దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత సంచలనంగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు.

మంగళూరులో పోలీస్ ఉద్యోగం చేస్తున్న అబు సలీమ్ ని మెయిన్ విలన్ గా ఎంచుకున్నారు. షావుకారు జానకి, భాను చందర్, బాబు మోహన్ తదితరులు ఇతర తారాగణం. అప్పటికే పాము ప్రధాన పాత్రల్లో వచ్చే సినిమాల ట్రెండ్ ఆగిపోయింది. అయినా సరే కోడిరామకృష్ణ గారు అదేమీ ఆలోచించకుండా సుమంత్ ఆర్ట్స్ టీమ్ తో కూర్చుని అద్భుతమైన కథను తయారు చేయించారు. మార్చి 12 థియేటర్లలో విడుదలైన దేవి ఘనవిజయం సాధించింది. కేవలం వారం గ్యాప్ లో వెంకటేష్ రాజా బ్లాక్ బస్టర్ అయినా ఆ పోటీని తట్టుకుని మరీ శతదినోత్సవం జరుపుకుంది. దేవిశ్రీప్రసాద్ కు గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది.

This post was last modified on March 12, 2024 7:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Devi Movie

Recent Posts

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

42 minutes ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

43 minutes ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

1 hour ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

2 hours ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

2 hours ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

3 hours ago