ఏదైనా సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే కథకు సంబంధించినదే ఉంటుంది. పాత్రల మధ్య లింకులను ఏదో ఒక రూపంలో దర్శకుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలా కాకుండా సంబంధం లేని స్టోరీలను చెప్పడానికి చూస్తే దాన్ని వెబ్ సిరీస్ అంటాం. కానీ టోవినో థామస్ కొత్త మూవీ అన్వేశిప్పిన్ కండెతుమ్ చూస్తే మాత్రం అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఫిబ్రవరిలో థియేటర్ రిలీజ్ జరుపుకుని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో సహా ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం కంటెంట్ లో ఉన్న వైవిధ్యం, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు.
ఇది మూడు దశాబ్దాల వెనుక అంటే 1993లో జరిగినట్టు చూపిస్తారు. లవ్లీ అనే అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ మధ్యలో మాయమవుతుంది. ఈ కేసుని ఎస్ఐ ఆనంద్(టోవినో థామస్)కు అప్పజెబుతారు. ఓ బావిలో శవం దొరుకుతుంది. అనుమానితులను విచారించే క్రమం ఊహించని విధంగా స్వంత కుటుంబ సభ్యుల్లోనే ఒకరు హంతకులుగా తేలతారు. ఈ క్రమంలో జరిగిన ఒక పొరపాటు వల్ల ఆనంద్ అండ్ టీమ్ సస్పెన్డ్ అవుతారు. ఆరేళ్ళ క్రితం చనిపోయిన మరో అమ్మాయి కేసుని ఛేదించమని ఎస్పి వీళ్ళను వేరే ఊరికి పంపిస్తాడు. అక్కడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మర్డర్ చేసిన వాళ్ళను వెతికే క్రమంలో గ్రామస్థులు తిరగబడతారు. ఊహించని విధంగా నిందితుడు ఎవరో తెలిసేసరికి అందరికీ ఫ్యూజులు పోతాయి. హీరో పాత్ర మినహాయించి రెండు కథలకు ఏ సంబంధం లేకుండా దర్శకుడు డార్విన్ కురియకోస్ రాసుకున్న విధానం బోర్ కొట్టకుండా సాగుతుంది. తెలుగు అనువాదం కూడా నీట్ గా ఉంది. ఒకవేళ థియేటర్ కు వచ్చి ఉంటే ఇలాంటివి ఆడటం కష్టం కానీ చక్కగా ఇల్లు కదలకుండా చూసేందుకు క్రైమ్ లవర్స్ కి ఇది మంచి ఆప్షనే. కిల్లర్స్ ఎవరనేది ముందే గుర్తిస్తే మాత్రం మీ టేస్ట్ అమోఘం అనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ట్రై చేయండి.
This post was last modified on March 13, 2024 9:45 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…