గత ఏడాది షారుఖ్ ఖాన్ తో జవాన్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ డిమాండ్ మాములుగా లేదు. ఓ రెండేళ్ల తర్వాతైనా సరే చేద్దామనే స్టార్ హీరోలు బాలీవుడ్ లోనే పెరిగిపోతున్నారు. అయినా సరే టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అల్లు అర్జున్ తో తనకో కమిట్ మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేసుకున్నారు. పుష్ప 2 ది రూల్ అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కన్నా ముందు ఇదే చేయాలని బన్నీ మనసులో ఉన్న ఆలోచనట.
దీనికి గాను అట్లీ అక్షరాలా అరవై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క రాజమౌళిని మినహాయిస్తే ఇంకెవరూ ఇంత మొత్తంలో దక్షిణాది నుంచి పారితోషికంగా తీసుకోవడం లేదు. కానీ అట్లీ అదేమీ ఆలోచించడం లేదట. మార్కెట్ ఉంది, బ్రాండ్ వచ్చింది, కాంబో అనౌన్స్ మెంట్ కే క్రేజ్ పుడుతుంది, షూటింగ్ పూర్తయ్యేలోగా బయ్యర్లు క్యూ కడతారనే అంచనాల మధ్య తనకిచ్చే మొత్తం ఎక్కువేం కాదని సన్నిహితులతో అంటున్నాడట. నిజమో కాదో కానీ మొత్తానికి ఒక డైరెక్టర్ గా తన స్థాయి పెరిగిన మాట వాస్తవం.
షారుఖ్ విజయ్ కాంబోలో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసుకున్న అట్లీకి ఆ కోరిక ఇప్పట్లో నెరవేరేలా లేదు. ఇంకో రెండు సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న విజయ్ ఇతనికి డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. అందుకే అల్లు అర్జున్ తో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. అడిగింది ఎక్కువ తక్కువ ఎంత ఇచ్చినా ఇది పట్టాలు ఎక్కడం ఖాయమేనని అల్లు కాంపౌండ్ న్యూస్. ఇంకోవైపు సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాక యానిమల్ పార్కా లేక బన్నీతో సినిమానా అనేది అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొంత కాలం ఈ సస్పెన్స్ తప్పదు.
This post was last modified on March 13, 2024 9:45 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…