టాలీవుడ్లో ఒక ముఖ్యమైన వీకెండ్కు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం రిలీజవుతున్న రెండు చిత్రాలు.. వాటి బృందాలకు ఎంతో కీలకం. ఈ రెండు చిత్రాల ఫలితం కోసం ఇండస్ట్రీ జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలే.. గామి, భీమా. ఇందులో మొదటి సినిమా చాలా ప్రత్యేకమైంది. విశ్వక్సేన్ అని అప్పుడే ఇండస్ట్రీలో తొలి అడుగులు వేస్తున్న కుర్రాడిని హీరోగా పెట్టి.. విద్యాధర్ కాగిత అనే కుర్రాడి నేతృతంలోని ఓ యువ బృందం కేవలం పాతిక లక్షలు చేతిలో పెట్టుకుని ఆరేళ్ల కిందట మొదలుపెట్టిన సినిమా ఇది.
ఐతే ఈ టీం విజన్, కష్టం, తపన.. ఇవన్నీ చూసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా మరింత డబ్బులు సమకూరాయి. ఎన్నో కష్టనష్టాలకు ఏళ్ల తరబడి ప్రొడక్షన్, ప్రి ప్రొడక్షన్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గామి టీజర్, ట్రైలర్ చూస్తే మాత్రం ఇది సెన్సేషన్ క్రియేట్ చేసే సత్తా ఉన్న సినిమాలా కనిపించింది. ఐతే ప్రోమోల్లో అద్భుతంగా అనిపించి.. సినిమాగా మెప్పించలేకపోయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ‘గామి’ తెరపై ఎలా ఉంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘గామి’ టీం కష్టం, తపన చూస్తే మ ాత్రం ఇది హిట్టవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇక ఈ వీకెండ్లో రాబోతున్న మరో తెలుగు చిత్రం ‘భీమా’ సక్సెస్ కావడం హీరో గోపీచంద్కు చాలా అవసరం. ఎప్పుడో 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత గోపీకి సరైన సక్సెస్ లేదు. ‘గౌతమ్ నంద’ లాంటి మంచి ప్రయత్నాలు కూడా ఫలితాన్నివ్వలేదు. ఈసారి అతను కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్లో ‘భీమా’ పేరుతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ చేశాడు. దీని ట్రైలర్ చూస్తే మాస్కు విందులా అనిపించింది. కానీ మాస్ పేరుతో రొటీన్ అంశాలతో నింపేస్తే ఈ రోజుల్లో జనాలు చూసే పరిస్థితి లేదు. ఇంకేదో ప్రత్యేకత ఉండాలి. మరి గోపీ-హర్ష కలిసి ప్రత్యేకంగా ఏం చేసి మెప్పించారో చూడాలి.
This post was last modified on March 8, 2024 9:51 am
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక్క రోజే సమయం ఉండగా.. ఈ టైంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సమానంగా సినీ హీరో…