సినిమా దర్శకుడిగానే కాదు బయట కూడా ప్రవర్తన, సూటిగా ఉండే మాట తీరుతో సందీప్ రెడ్డి వంగాకు చాలా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అతను తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి ఏడుకొండలవాడిని దర్శించుకుని వచ్చాడు. నిన్నటి దాకా నిండైన జుట్టుతో, భారీ మీసాలు గడ్డంతో అరోగంట్ హీరోకు అడ్రెస్ గా అనిపించిన సందీప్ హఠాత్తుగా జుత్తు లేకుండా గుండుతో కనిపించేసరికి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. పైగా ఎలాంటి హడావిడి లేకుండా ఒక సామాన్యుడిలా వెళ్లి రావడం ఆశ్చర్యపరిచింది. ఎవరో గుర్తుపట్టి వీడియో తీసేదాకా అసలీ సంగతే ఎవరికీ తెలియదు.
ఇప్పుడిది ట్రెండింగ్ అవుతోంది. శివాజీలో రజనీకాంత్ ఫస్ట్ హాఫ్ లో జుత్తుతో కనిపించి చివరి గంట గుండుతో మేజిక్ చేస్తాడు. సందీప్ వంగా కూడా అచ్చం అదే తరహాలో యానిమల్ టైంలో హెయిర్ స్టైల్ తో ఉండి నెక్స్ట్ స్పిరిట్ తో గుండు బాస్ లా రచ్చ చేస్తాడని వీడియోలు ఎడిట్ చేసి మరీ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. యానిమల్ పార్క్ ని వాయిదా వేసుకుని సందీప్ వంగా ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలోగా షూటింగ్ మొదలుపెట్టాలని ప్రణాళిక వేసుకున్నారు కానీ ప్రభాస్ ఇతర కమిట్ మెంట్ల మీద ఇది ఆధారపడి ఉంది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ వంగా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తన కంటెంట్ మీద విమర్శలు చేస్తున్న వాళ్లకు మొహం వాచిపోయేలా ఇస్తున్న కౌంటర్లు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మధ్య రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా ప్రపంచంలోని బూతులన్నీ మీ కొడుకు నిర్మాతగా తీసిన మీర్జాపూర్ సిరీస్ లో ఉన్నాయని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. ఇలాంటి వాటి వల్లే సందీప్ వంగా ఫాలోయింగ్ ఆఫ్ లైన్ లోనూ ఓ రేంజ్ లో ఉంది. నిజమైన యాటిట్యూడ్ అంటే ఇదేనేమో.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…