చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ప్లానింగ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీమ్ దానికి అనుగుణంగానే చకచకా కానిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తోందనే వార్త మెగా ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే టార్గెట్ ని చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఇందులో కథ ప్రకారం చిరంజీవికి అయిదుగురు చెల్లెళ్లు ఉంటారనే లీక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ ఆ పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్సా లేక చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషనే. అందులో సందేహం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెళ్లకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు, బావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట.. మూవీ రేంజ్ కి తగ్గట్టు క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవాలి కదా.
కాస్త పేరు, గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట. భోళా శంకర్ లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసార తరహాలో ఎమోషన్స్ కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యువి బృందం ఉంది.
This post was last modified on March 3, 2024 8:08 am
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…