చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ప్లానింగ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీమ్ దానికి అనుగుణంగానే చకచకా కానిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తోందనే వార్త మెగా ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే టార్గెట్ ని చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఇందులో కథ ప్రకారం చిరంజీవికి అయిదుగురు చెల్లెళ్లు ఉంటారనే లీక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ ఆ పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్సా లేక చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషనే. అందులో సందేహం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెళ్లకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు, బావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట.. మూవీ రేంజ్ కి తగ్గట్టు క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవాలి కదా.
కాస్త పేరు, గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట. భోళా శంకర్ లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసార తరహాలో ఎమోషన్స్ కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యువి బృందం ఉంది.
This post was last modified on March 3, 2024 8:08 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…