Movie News

విశ్వంభర చెల్లెళ్ళకు జోడి సమస్య

చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ప్లానింగ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీమ్ దానికి అనుగుణంగానే చకచకా కానిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తోందనే వార్త మెగా ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే టార్గెట్ ని చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.

ఇందులో కథ ప్రకారం చిరంజీవికి అయిదుగురు చెల్లెళ్లు ఉంటారనే లీక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ ఆ పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్సా లేక చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషనే. అందులో సందేహం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెళ్లకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు, బావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట.. మూవీ రేంజ్ కి తగ్గట్టు క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవాలి కదా.

కాస్త పేరు, గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట. భోళా శంకర్ లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసార తరహాలో ఎమోషన్స్ కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యువి బృందం ఉంది.

This post was last modified on March 3, 2024 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago