Movie News

‘వుడ్’ తీసేయమంటున్న లెజెండ్

నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు లెజెండరీ నటుడు అనిల్ కపూర్. ఒకప్పుడు ‘మిస్టర్ ఇండియా’ లాంటి చిత్రాలతో యువతను ఒక ఊపు ఊపిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌తో అదరగొడుతున్నారు. ‘నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో అనిల్ విలనీకి.. ‘యానిమల్’లో తండ్రి పాత్రలో ఆయన చూపించిన అభినయానికి ఫిదా అవ్వని వారుండరు.

లేటు వయసులో అదిరిపోయే పాత్రలతో సాగిపోతున్న అనిల్ కపూర్.. ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని.. ఇక బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని సంబోధించడం మానేయాలని అంటున్నారు. దక్షిణాది సినిమాలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రశంసల జల్లు కురిపించారు. తన ఎదుగుదల సౌత్ సినిమాల నుంచే మొదలైందని ఆయన అన్నారు.

తెలుగులో బాపు దర్శకత్వంలో ‘వంశవృక్షం’, కన్నడలో మణిరత్నం డైరెక్షన్లో ‘పల్లవి అనుపల్లవి’ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించాడు అనిల్. ఆ తర్వాత ఆయన బాలీవుడ్లో హీరోగా మంచి స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీని అనిల్ కొనియాడాడు.

“నాకు దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టం. నేను అక్కడి నుంచే నటుడిగా ఎదిగాను. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల రీమేక్‌ల్లో నటించి బాలీవుడ్లో నిలదొక్కుకున్నాను. సౌత్‌లో అద్భుతమైన కథలు వస్తుంటాయి. ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించాయి. అవి దేశాన్ని ఏకం చేశాయి. ఇక బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ లాంటి మాటలు సరికాదు. భారతీయ సినిమాలను వేరు చేయకండి. అన్ని సినిమాలనూ కలిపి ఇండియన్ సినిమాగా చూడండి” అని అనిల్ స్పష్టం చేశాడు.

This post was last modified on March 1, 2024 9:58 am

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

18 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

40 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

1 hour ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago