పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27 విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఇటీవలే ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికలు కాగానే పవన్ ఓ ఇరవై రోజులు కాల్ షీట్లు ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని అనుకున్న డేట్ కే వస్తామని చెప్పడం వీడియోగానూ బయటికి వచ్చింది. అయితే ప్యాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీదే ఉండే పరిస్థితులు లేవని గత నాలుగైదు సంవత్సరాలుగా ఋజువవుతూనే ఉంది. అలాంటప్పుడు ఓజి మాత్రమే కట్టుబడి ఉంటుందని ఎలాంటి గ్యారెంటీ లేదు. అందుకే ప్లాన్ బి సిద్ధమవుతోందని ఇన్ సైడ్ టాక్.
దాని ప్రకారం ఒకవేళ ఓజి కనక తప్పుకునే సంకట స్థితి వస్తే దాని స్థానంలో గేమ్ ఛేంజర్ తేవాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఎలాగూ ఇండియన్ 2 మేలో వస్తుందని చెన్నై వర్గాలు నొక్కి చెబుతున్నాయి కాబట్టి శంకర్ ఈ మార్పుకి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకైనా మంచిది షూట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగంగా చేసి ఆగస్ట్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిసింది. ఇదంత తేలిక కాదు. తమన్ రీ రికార్డింగ్, ఆడియో సాంగ్స్ లాంచ్, టీజర్ ట్రైలర్ ఈవెంట్లు ఇలా ముందస్తు ప్లానింగ్ బోలెడు అవసరం ఉంటుంది.
ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తిరుగుతోంది కానీ అనూహ్యంగా మారుతున్న పెద్ద సినిమాల ప్లానింగ్ లో ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేలేం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ విపరీతంగా ఆలస్యమయ్యింది. ఒకవేళ సెప్టెంబరే బెస్ట్ ఆప్షన్ అనుకున్న తరుణంలో చరణ్ పర్సనల్ గా అడిగితే పవన్ నో చెప్పకపోవచ్చు. ఆర్ఆర్ఆర్ నిర్మాతగా దానయ్య కూడా ఆ రిక్వెస్ట్ పట్ల సానుకూలంగా ఉంటారు. ఫ్యాన్స్ కి ఏది వచ్చినా పండగే కానీ వీలైనంత త్వరగా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల తేదీతో సహా వదలాలనేది టీమ్ ప్లాన్. చూద్దాం.
This post was last modified on February 26, 2024 8:17 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…