Political News

వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన వార్నింగ్

ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే వారు ఈ జిల్లాలకు ఇన్చార్జిలుగా వచ్చారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఆరోపణలను నిజం చేస్తూ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

ఎవడో సుబ్బారెడ్డి అంట కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తాం అంటున్నాడు అని ధర్మాన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బ సొమ్ము కాదు..తంతా పొమ్మని ఆ సుబ్బారెడ్డికి తాను వార్నింగ్ ఇచ్చాను అని ధర్మాన చెప్పుకొచ్చారు. వచ్చినవాడు ఏ పార్టీ అనేది చూడనని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తానంటే అవమానంగా భావిస్తానని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాగే వదిలేస్తే శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రౌడీల మయం అయిపోతుందని, ప్రశాంతంగా పట్టణాలు ఉండాలని చెప్పారు.

ఇన్ని చేసినా మీకు నేను పనికి రాకపోతే మీ ఇష్టం అంటూ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ధర్మాన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విజ్ఞతతో ఆలోచించాలని, ప్రజల అభిమానంతోనే తాను గెలుస్తున్నానని అన్నారు. గెలిస్తే శక్తివంతంగా ఉంటానని, ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని ధర్మాన వ్యాఖ్యానించారు. అయితే, తన కుమారుడికి ధర్మాన వైసిపి టికెట్ ఆశించగా దానికి సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై ధర్మాన ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

This post was last modified on February 26, 2024 8:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

31 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago