ప్రతి దర్శకుడికి సాంకేతిక బృందంలోని కొందరితో మంచి సింక్ కుదురుతుంది. ఒక్కసారి నచ్చేస్తే మళ్ళీ వదులుకునేందుకు ఇష్టపడరు. సుకుమార్, ఛాయాగ్రాయకుడు రత్నవేలు బాండింగ్ అలాంటిదే. వీళ్ళ బంధం ఆర్య నుంచే మొదలైంది. తన మొదటి విజయంలో భాగమైనప్పటి నుంచి సుక్కు అంత సులభంగా విడిచిపెట్టడం లేదు. జగడం, 1 నేనొక్కడినే ఫలితాలు నిరాశపరిచినా వాటి కెమెరా వర్క్ మీద నెగటివ్ రిమార్క్స్ రాలేదు. పైపెచ్చు సినిమాటోగ్రఫీకి సైమా అవార్డు దక్కింది. కుమార్ 21 ఎఫ్ ని తక్కువ బడ్జెట్ లో తీసినా నిర్మాతగా సుకుమార్ పెట్టిన ఖర్చు రత్నవేలు మీద మాత్రమే.
ఇక రంగస్థలం గురించి చెప్పనక్కర్లేదు. దానికొచ్చిన రికార్డులు, సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే పుష్పకు రత్నవేలు పని చేయలేదు. సరిలేరు నీకెవ్వరు. సైరా నరసింహారెడ్డి కమిట్ మెంట్స్ వల్ల కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతున్న ఆర్సి 16కి రత్నవేలుని లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఇండియన్ 2 పూర్తి చేసి, దేవర ఫినిషింగ్ లో ఉన్నాడు. ఎలాగూ ఈ రెండు వేసవిలోగా పూర్తవుతాయి కాబట్టి సమ్మర్ లో స్టార్ట్ అయ్యే చరణ్ మూవీకి పూర్తి అందుబాటులో ఉండొచ్చు.
ఆర్సి 16కి సుకుమార్ నిర్మాణ భాగస్వామిగానే కాకుండా బుచ్చిబాబు గురువుగా ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఈయన చెప్పడం వల్లే రత్నవేలు టీమ్ లోకి వచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఉప్పెనకు శ్యామ్ దత్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మార్పు పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్న టైంలో క్రమం తప్పకుండా ప్రకటనలు, ఆడిషన్లు, అనౌన్స్ మెంట్లు చేస్తున్న బుచ్చిబాబు టీమ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది కానీ ఆ లాంఛనం మాత్రం కొంత ఆలస్యంగా బహిర్గతం చేస్తారు.
This post was last modified on February 24, 2024 11:59 am
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…