బాలీవుడ్ లో ఏదైనా కొత్త సినిమా థియేటర్ రిలీజ్, ఓటిటికి మధ్య ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధనని చాలా కఠినంగా పాటిస్తున్నారు. లేదంటే తమ మల్టీప్లెక్సులను రిలీజ్ కు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేయడంతో ఉత్తరాది నిర్మాతలు దానికి అనుగుణంగానే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ నెలలోపే స్ట్రీమ్టింగ్ అంటే మాత్రం సింగల్ స్క్రీన్లతో సర్దుకోవాల్సిందే. కానీ ఇలాంటి పద్ధతులు సౌత్ లో సాధ్యపడటం లేదు. సలార్, గుంటూరు కారం, నా సామిరంగ వగైరాలన్నీ కేవలం 28 రోజులకే వచ్చేసాయి. సైంధవ్ మరీ అన్యాయంగా మూడో వారంలోనే ప్రత్యక్షం.
ఇప్పుడీ ధోరణి మారాలనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన. మన దగ్గర తక్కువే కానీ వీటి ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంది. అక్కడి థియేటర్లు సరైన సినిమాల ఫీడింగ్ లేక కనీస ఖర్చులు రాక ఇబ్బంది పడుతున్నాయి తెలుగులో హనుమాన్ లాంటివి హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ని నమ్ముకుని కనక వర్షం కురిపించాయి. టాక్ తేడాగా ఊగినా గుంటూరు కారం వసూళ్లు అదిరిపోయాయి. కానీ కోలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే హిందీలోలా ఇక్కడ కూడా సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంత సులభంగా తేలే యవ్వారం మాత్రం కాదు.
ఎందుకంటే తెలుగు నిర్మాతలకు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పెట్టిన పెట్టుబడి రెవిన్యూ రూపంలో గరిష్టంగా రెండు మూడు వారాల్లోనే వచ్చేస్తోంది. మన ఆడియన్స్ ఆలోపే థియేటర్లలో చూస్తున్నారు. టికెట్ రేట్లకు భయపడో లేదా టాక్ విని వెనుకడుగు వేసిన వాళ్ళు ఓటిటి కోసమే ఎదురు చూస్తారు. పైగా నిర్మాణ సమయంలో ప్రొడ్యూసర్లకు ఆఫర్లు ఇస్తున్న ఓటిటిలు తక్కువ గ్యాప్ అయితేనే భారీ మొత్తాన్ని ఇస్తున్నాయి. లేదంటే సగం దాకా కోత ఉంటుందట. సో పద్మవ్యూహం లాంటి పరిస్థితిలో వీటిని కట్టడి చేయడం, నియంత్రించడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు.
This post was last modified on February 21, 2024 2:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…