బాలీవుడ్ లో ఏదైనా కొత్త సినిమా థియేటర్ రిలీజ్, ఓటిటికి మధ్య ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధనని చాలా కఠినంగా పాటిస్తున్నారు. లేదంటే తమ మల్టీప్లెక్సులను రిలీజ్ కు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేయడంతో ఉత్తరాది నిర్మాతలు దానికి అనుగుణంగానే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ నెలలోపే స్ట్రీమ్టింగ్ అంటే మాత్రం సింగల్ స్క్రీన్లతో సర్దుకోవాల్సిందే. కానీ ఇలాంటి పద్ధతులు సౌత్ లో సాధ్యపడటం లేదు. సలార్, గుంటూరు కారం, నా సామిరంగ వగైరాలన్నీ కేవలం 28 రోజులకే వచ్చేసాయి. సైంధవ్ మరీ అన్యాయంగా మూడో వారంలోనే ప్రత్యక్షం.
ఇప్పుడీ ధోరణి మారాలనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన. మన దగ్గర తక్కువే కానీ వీటి ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంది. అక్కడి థియేటర్లు సరైన సినిమాల ఫీడింగ్ లేక కనీస ఖర్చులు రాక ఇబ్బంది పడుతున్నాయి తెలుగులో హనుమాన్ లాంటివి హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ని నమ్ముకుని కనక వర్షం కురిపించాయి. టాక్ తేడాగా ఊగినా గుంటూరు కారం వసూళ్లు అదిరిపోయాయి. కానీ కోలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే హిందీలోలా ఇక్కడ కూడా సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంత సులభంగా తేలే యవ్వారం మాత్రం కాదు.
ఎందుకంటే తెలుగు నిర్మాతలకు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పెట్టిన పెట్టుబడి రెవిన్యూ రూపంలో గరిష్టంగా రెండు మూడు వారాల్లోనే వచ్చేస్తోంది. మన ఆడియన్స్ ఆలోపే థియేటర్లలో చూస్తున్నారు. టికెట్ రేట్లకు భయపడో లేదా టాక్ విని వెనుకడుగు వేసిన వాళ్ళు ఓటిటి కోసమే ఎదురు చూస్తారు. పైగా నిర్మాణ సమయంలో ప్రొడ్యూసర్లకు ఆఫర్లు ఇస్తున్న ఓటిటిలు తక్కువ గ్యాప్ అయితేనే భారీ మొత్తాన్ని ఇస్తున్నాయి. లేదంటే సగం దాకా కోత ఉంటుందట. సో పద్మవ్యూహం లాంటి పరిస్థితిలో వీటిని కట్టడి చేయడం, నియంత్రించడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…