లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య – సాయిపల్లవి కాంబినేషన్ తో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ ని దసరాకు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలియడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే అదే పండగని టార్గెట్ చేసుకుని దేవర పార్ట్ 1 డేట్ ని అక్టోబర్ 10 ప్రకటించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే చైతు మూవీని (ఇంకా అఫీషియల్ కాలేదు) రేసులోకి తేవడం ఆసక్తికరమైన పరిణామం. తారక్ ప్యాన్ ఇండియా మూవీతో తలపడటం అంత సులభం కాదు. పైగా తండేల్ కూడా సింగల్ లాంగ్వేజ్ కాదు. బహు భాషల్లో విడుదల చేస్తున్నారు. సో అన్ని మార్కెట్లలో క్లాష్ ఉంటుంది.
ఇంత రిస్క్ వెనుక నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాస్ కొన్ని పక్కా లెక్కలు వేసుకున్నట్టు కనిపిస్తోంది. డేట్ చెప్పడమైతే జరిగింది దేవర ఖచ్చితంగా అదే మాట మీద ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఏ చరిత్ర చూసినా ఏముంది స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదాల పర్వాలే అన్న తీరులో ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామ వల్ల ముందుకో వెనక్కో జరిగితే ఆటోమేటిక్ గా స్లాట్ ఖాళీ అవుతుంది. దాన్ని తండేల్ వాడుకోవచ్చు. పుష్ప 2 కనక ఆగస్ట్ నుంచి తప్పుకుంటే దేవర ఆ ప్లేస్ ని తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. కానీ సుకుమార్ టీమ్ కొట్టి పారేస్తోంది.
ఏ నిమిషంలో ఏదైనా జరగొచ్చు కాబట్టి తండేల్ ని సెప్టెంబర్ లోపే పూర్తి చేసుకుంటే ఏదైనా మంచి తేదీ దొరకడం ఆలస్యం విడుదల చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇలా ప్లానింగ్ మిస్ కావడం వల్లే టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటివి ఇబ్బంది పడటం చూశాం. కానీ తండేల్ కి అలాంటి సమస్యలేం లేవు. ఇప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చారు కానీ సాయిపల్లవి తిరిగి రాగానే షూట్ వేగమందుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి పాటలు రాబట్టుకోవడంలో చందూ బిజీ ఉన్నాడు. ఇండియా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సముద్రపు ప్రేమకథగా తండేల్ లో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉంటాయట.
This post was last modified on February 18, 2024 7:34 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…