ఊరు పేరు భైరవకోన.. ఈ వారం తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రాల్లో విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్న మూవీ. నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్గా విడుదలకు రెండు రోజుల ముందే దీనికి పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. ఐతే ఆ షోలన్నీ బాగానే నిండిపోయాయి కానీ.. వాటి నుంచి టాక్ అయితే ఆశించిన స్థాయిలో రాలేదు. షోలు అయ్యాక ఒక రకమైన నిశ్శబ్దం కనిపించింది సోషల్ మీడియాలో. సినిమా అంచనాలకు తగ్గట్లు లేదనే టాక్ రావడమే అందుక్కారణం.
ఇక శుక్రవారం సినిమా రిలీజయ్యాక కూడా కొంచెం సందడి కనిపించింది. రివ్యూలైతే మిక్స్డ్గానే వచ్చాయి. దీంతో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని అనుకున్నారు. మామూలుగా డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు మ్యాట్నీ నుంచి కలెక్షన్లు డల్ అయిపోతాయి. కానీ ‘ఊరు పేరు భైరవకోన’ విషయంలో మాత్రం అలా జరగలేదు. మ్యాట్నీలకు మంచి ఆక్యుపెన్సీనే కనిపించింది. ఇక ఈవెనింగ్, నైట్ షోలు అయితే చాలా చోట్ల ఫుల్ ఆక్యుపెన్సీలతో నడిచాయి. ప్రిమియర్స్ నుంచి వచ్చిన టాక్ తర్వాత తక్కువ అంచనాలతో సినిమా చూసిన వాళ్లకు ఇది నాట్ బ్యాడ్ అనిపిస్తోంది. ఒకసారి చూడ్డానికి ఓకే అనే టాక్ స్ప్రెడ్ కావడంతో.. థియేటర్లలో చూసే వాల్యూ ఉన్న మూవీ కావడంతో సాయంత్రం, నైట్ షోలు జనాలతో కళకళలాడాయి. ఆ ప్రభావం ఓపెనింగ్స్లోనూ స్పష్టంగా కనిపించింది.
నిర్మాతలు ప్రకటించినదాని ప్రకారం తొలి రోజు ‘ఊరు పేరు భైరవకోన’ ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద నంబరే. నిర్మాతలు నంబర్స్ కొంచెం పెంచి చూపించి ఉండొచ్చనుకున్నా గ్రాస్ ఐదు కోట్లకు అయితే తగ్గలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. పెయిడ్ ప్రిమియర్స్తో డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యకరం. వీకెండ్ వరకు అయితే సినిమాకు ఢోకా లేదు. ఆ లోపు సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on February 17, 2024 5:31 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…