యువ నటుడు విశ్వక్ సేన్ ఎనర్జీ గురించి తెలిసిందే. వచ్చే నెల 8 గామిలో అఘోరాగా కొత్త అవతారంతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత తక్కువ గ్యాప్ తో గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చెప్పిన ఒక ముచ్చట అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే విశ్వక్ కు చాలా ఇష్టమైన హీరో సినిమాలో పెద్ద ఆఫర్ వస్తే చేయలేదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ లాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. అయినా ఒప్పుకోలేదట.
ఎందుకు అంటే అంతకన్నా మంచి క్యారెక్టర్ తన ఫేవరేట్ హీరోతో చేయాలనే ఉద్దేశంతోనని చెప్పాడు. నేరుగా పేరు చెప్పలేదు కానీ కొంచెం డీ కోడ్ చేసి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. విశ్వక్ సేన్ విపరీతంగా లైక్ చేసే హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సందర్భాల్లో ఓపెన్ గా చెప్పాడు. దేవరలో తారక్ తప్ప మరో యూత్ హీరోకు స్కోప్ లేదని క్యాస్టింగ్ చూసి చెప్పొచ్చు. సో అది కాదు. ఇక బాలయ్య దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. ఎంతో ప్రాముఖ్యం ఉంటే తప్ప ఈ మలయాళీ స్టార్ ఒప్పుకోడనే సంగతి ఓపెన్ సీక్రెట్.
సో విశ్వక్ మిస్ చేసుకున్నది దుల్కర్ పట్టేసుకున్నాడన్న మాట. ఎవరు ఏమనుకున్నా తనకు తోచిందే చేస్తానని చెప్పే విశ్వక్ సేన్ ఆ మధ్య డిసెంబర్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే దాని ప్రమోషన్లకు రానని చెప్పడం, ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని మనసు మార్చుకోవడం చూశాం. అయినా సరే మార్చి 8 పెట్టుకున్న కొత్త డేట్ కూడా వాయిదా పడి గామికి ఇచ్చేయాల్సి రావడం ఊహించని పరిణామం. ఏది ఏమైనా బాలయ్య విశ్వక్ కలయికలో సీన్లు మంచి మాస్ గా ఉండేవి. బాబీ డైరెక్టర్ కాబట్టి కాంబో సన్నివేశాలను మంచి ఎలివేషన్లతో తీసేవాడు. మిస్ అయ్యింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…