యువ నటుడు విశ్వక్ సేన్ ఎనర్జీ గురించి తెలిసిందే. వచ్చే నెల 8 గామిలో అఘోరాగా కొత్త అవతారంతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత తక్కువ గ్యాప్ తో గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చెప్పిన ఒక ముచ్చట అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే విశ్వక్ కు చాలా ఇష్టమైన హీరో సినిమాలో పెద్ద ఆఫర్ వస్తే చేయలేదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ లాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. అయినా ఒప్పుకోలేదట.
ఎందుకు అంటే అంతకన్నా మంచి క్యారెక్టర్ తన ఫేవరేట్ హీరోతో చేయాలనే ఉద్దేశంతోనని చెప్పాడు. నేరుగా పేరు చెప్పలేదు కానీ కొంచెం డీ కోడ్ చేసి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. విశ్వక్ సేన్ విపరీతంగా లైక్ చేసే హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సందర్భాల్లో ఓపెన్ గా చెప్పాడు. దేవరలో తారక్ తప్ప మరో యూత్ హీరోకు స్కోప్ లేదని క్యాస్టింగ్ చూసి చెప్పొచ్చు. సో అది కాదు. ఇక బాలయ్య దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. ఎంతో ప్రాముఖ్యం ఉంటే తప్ప ఈ మలయాళీ స్టార్ ఒప్పుకోడనే సంగతి ఓపెన్ సీక్రెట్.
సో విశ్వక్ మిస్ చేసుకున్నది దుల్కర్ పట్టేసుకున్నాడన్న మాట. ఎవరు ఏమనుకున్నా తనకు తోచిందే చేస్తానని చెప్పే విశ్వక్ సేన్ ఆ మధ్య డిసెంబర్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే దాని ప్రమోషన్లకు రానని చెప్పడం, ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని మనసు మార్చుకోవడం చూశాం. అయినా సరే మార్చి 8 పెట్టుకున్న కొత్త డేట్ కూడా వాయిదా పడి గామికి ఇచ్చేయాల్సి రావడం ఊహించని పరిణామం. ఏది ఏమైనా బాలయ్య విశ్వక్ కలయికలో సీన్లు మంచి మాస్ గా ఉండేవి. బాబీ డైరెక్టర్ కాబట్టి కాంబో సన్నివేశాలను మంచి ఎలివేషన్లతో తీసేవాడు. మిస్ అయ్యింది.
This post was last modified on February 17, 2024 10:01 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…