మెగాస్టార్ చిరంజీవి ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నారనే వార్త రెండు మూడు రోజుల క్రితం బాగానే చక్కర్లు కొట్టింది. విశ్వంభరలో బిజీగా ఉన్న చిరు దీన్ని చేస్తారని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. మంచి సబ్జెక్టు దొరికితే చేయాలని ఆయన మనసులో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పకిప్పుడు ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వలేదట. రానా నాయుడు విషయంలో వెంకటేష్ ఎదురుకున్న క్రిటిసిజంని దృష్టిలో పెట్టుకుని కేవలం కథని విని గుడ్డిగా ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
నిజానికి ఆహా కోసం అల్లు అరవింద్ ఇలాంటి ప్రతిపాదన రెండేళ్ల క్రితమే తీసుకొచ్చారు. కానీ స్టోరీ, దర్శకుడు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో అదే ప్లాట్ ఫార్మ్ లో వచ్చిన సమంతా టాక్ షోకి అతిధిగా, సింగర్ షోకి గెస్టుగా వచ్చి బ్రాండ్ బిల్డింగ్ కి కొంత తోడ్పడ్డారు చిరు. తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రణాళికలు అనుకోలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్ సైతం ఓ ప్రొపోజల్ ని తయారు చేసి రామ్ చరణ్ ద్వారా చిరంజీవి దాకా తీసుకెళ్లింది కానీ వాళ్ళ కంటెంట్ లోని బోల్డ్ నెస్ గురించి ముందే అవగాహన ఉన్న చిరు సున్నితంగా దాన్ని పెండింగ్ లో ఉంచారట. ఇది తెరవెనుక జరుగుతున్న కథ.
బుల్లితెరపై కనిపించకూడదనే నియమం చిరంజీవి పెట్టుకోలేదు. అందుకే గతంలోనే మీలో ఎవరు కోటీశ్వరుడుకి హోస్ట్ గా చేశారు. అంతగా వర్కౌట్ కాలేదు కానీ దాన్ని నడిపించిన విధానం బాగానే పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టీవీకి దూరంగా ఉన్నారు. విశ్వంభర అయ్యాక హరీష్ శంకర్, అనిల్ రావిపూడిలు ఆయన కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. రవితేజ, వెంకటేష్ లతో వాళ్ళ సినిమాలు పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్లు సిద్ధం చేసుకుని చిరంజీవికి వినిపిస్తారు. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ లు గట్రా అంత సులభంగా జరిగే వ్యవహారాలు కాదు. సో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on February 13, 2024 2:04 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…