Political News

కేసీయార్ ప్లాన్ రివర్సయ్యిందా ?

తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది.

ఇక నల్గొండ సభ మధ్యాహ్నం నల్గొండ పట్టణ శివార్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు నాందిగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభ. అందుకనే జిల్లా మొత్తం నుండి 2 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున ధ్వజమెత్తేందుకు నిర్ణయించుకుని మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు.

అయితే అనూహ్యంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం తీర్మానంచేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగిస్తు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పదేపదే అసెంబ్లీలో చెప్పారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే బురదచల్లేస్తున్నట్లు ఎదురుదాడి చేశారు. తమ చిత్తశుద్ది ఇది అని నిరూపించేందుకు తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం కూడా చేశారు. ఇపుడేమైందంటే మధ్యాహ్నం నల్గొండలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేలిపోయింది.

తెలంగాణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ముడిపెట్టి ఆరోపణలు చేయాలని అనుకున్నపుడు అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో  ఈ చర్చనే లేవనెత్తకుండా ఉండాల్సింది. బయట కూడా ఎక్కడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించకుండా ఉండుంటే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. అప్పుడు బహిరంగసభలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కేసీయార్ కు కావాల్సినంత అవకాశం దొరికుండేది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించుంటే ప్రభుత్వం ఇరుకునపడుండేది. కాని ఇపుడు బీఆర్ఎస్ చేసిన పనివల్ల ప్రభుత్వం మేల్కొని తీర్మానం చేయటంతో కేసీయార్ ప్లాన్ రివర్సు కొట్టినట్లయ్యింది. 

This post was last modified on February 13, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

13 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago