Political News

కేసీయార్ ప్లాన్ రివర్సయ్యిందా ?

తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది.

ఇక నల్గొండ సభ మధ్యాహ్నం నల్గొండ పట్టణ శివార్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు నాందిగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభ. అందుకనే జిల్లా మొత్తం నుండి 2 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున ధ్వజమెత్తేందుకు నిర్ణయించుకుని మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు.

అయితే అనూహ్యంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం తీర్మానంచేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగిస్తు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పదేపదే అసెంబ్లీలో చెప్పారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే బురదచల్లేస్తున్నట్లు ఎదురుదాడి చేశారు. తమ చిత్తశుద్ది ఇది అని నిరూపించేందుకు తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం కూడా చేశారు. ఇపుడేమైందంటే మధ్యాహ్నం నల్గొండలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేలిపోయింది.

తెలంగాణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ముడిపెట్టి ఆరోపణలు చేయాలని అనుకున్నపుడు అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో  ఈ చర్చనే లేవనెత్తకుండా ఉండాల్సింది. బయట కూడా ఎక్కడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించకుండా ఉండుంటే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. అప్పుడు బహిరంగసభలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కేసీయార్ కు కావాల్సినంత అవకాశం దొరికుండేది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించుంటే ప్రభుత్వం ఇరుకునపడుండేది. కాని ఇపుడు బీఆర్ఎస్ చేసిన పనివల్ల ప్రభుత్వం మేల్కొని తీర్మానం చేయటంతో కేసీయార్ ప్లాన్ రివర్సు కొట్టినట్లయ్యింది. 

This post was last modified on February 13, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago