Political News

కేసీయార్ ప్లాన్ రివర్సయ్యిందా ?

తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది.

ఇక నల్గొండ సభ మధ్యాహ్నం నల్గొండ పట్టణ శివార్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు నాందిగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభ. అందుకనే జిల్లా మొత్తం నుండి 2 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున ధ్వజమెత్తేందుకు నిర్ణయించుకుని మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు.

అయితే అనూహ్యంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం తీర్మానంచేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగిస్తు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పదేపదే అసెంబ్లీలో చెప్పారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే బురదచల్లేస్తున్నట్లు ఎదురుదాడి చేశారు. తమ చిత్తశుద్ది ఇది అని నిరూపించేందుకు తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం కూడా చేశారు. ఇపుడేమైందంటే మధ్యాహ్నం నల్గొండలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేలిపోయింది.

తెలంగాణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ముడిపెట్టి ఆరోపణలు చేయాలని అనుకున్నపుడు అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో  ఈ చర్చనే లేవనెత్తకుండా ఉండాల్సింది. బయట కూడా ఎక్కడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించకుండా ఉండుంటే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. అప్పుడు బహిరంగసభలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కేసీయార్ కు కావాల్సినంత అవకాశం దొరికుండేది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించుంటే ప్రభుత్వం ఇరుకునపడుండేది. కాని ఇపుడు బీఆర్ఎస్ చేసిన పనివల్ల ప్రభుత్వం మేల్కొని తీర్మానం చేయటంతో కేసీయార్ ప్లాన్ రివర్సు కొట్టినట్లయ్యింది. 

This post was last modified on February 13, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

2 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

5 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

5 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

5 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

5 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

6 hours ago