తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది.
ఇక నల్గొండ సభ మధ్యాహ్నం నల్గొండ పట్టణ శివార్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు నాందిగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభ. అందుకనే జిల్లా మొత్తం నుండి 2 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున ధ్వజమెత్తేందుకు నిర్ణయించుకుని మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు.
అయితే అనూహ్యంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం తీర్మానంచేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగిస్తు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పదేపదే అసెంబ్లీలో చెప్పారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే బురదచల్లేస్తున్నట్లు ఎదురుదాడి చేశారు. తమ చిత్తశుద్ది ఇది అని నిరూపించేందుకు తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం కూడా చేశారు. ఇపుడేమైందంటే మధ్యాహ్నం నల్గొండలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేలిపోయింది.
తెలంగాణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ముడిపెట్టి ఆరోపణలు చేయాలని అనుకున్నపుడు అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో ఈ చర్చనే లేవనెత్తకుండా ఉండాల్సింది. బయట కూడా ఎక్కడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించకుండా ఉండుంటే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. అప్పుడు బహిరంగసభలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కేసీయార్ కు కావాల్సినంత అవకాశం దొరికుండేది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించుంటే ప్రభుత్వం ఇరుకునపడుండేది. కాని ఇపుడు బీఆర్ఎస్ చేసిన పనివల్ల ప్రభుత్వం మేల్కొని తీర్మానం చేయటంతో కేసీయార్ ప్లాన్ రివర్సు కొట్టినట్లయ్యింది.
This post was last modified on February 13, 2024 10:08 am
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…