తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకపుడు టీడీపీ తరపున ఎస్సీ సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత వర్ల కాదు కంభంపాటి రామ్మోహన్ రావు పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఇపుడేమో అసలు టీడీపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి కనబడటం లేదు. నామినేషన్ల దాఖలకు 15వ తేదీ ఆఖరు.
వైసీపీ తరపున పోటీ చేయబోతున్న గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డికి జగన్మోహన్ రెడ్డి బీ ఫారాలను అందించారు. ఈరోజే రేపో వీళ్ళు నామినేషన్లు వేయబోతున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు వేరే ఎవరు నామినేషన్లు వేయకపోతే వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లే. వైసీపీ తరపున ముగ్గురిని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేట్లు చేయలానే ప్రశ్న టీడీపీలో బలంగా వినబడుతోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పోటీ పెట్టేందుకు అవసరమైన ఓట్ల బలం లేదు.
ఇపుడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 174. ఇందులో వైసీపీ తరపున 151 మంది ఉంటే టీడీపీ తరపున 22 మందే ఉన్నారు. తాజా సంఖ్యా బలాన్ని బట్టి ప్రతి రాజ్యసభ ఎంపీకి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురికి కలిసి 129 ఓట్లు అవసరం. వైసీపీకి ఉన్న బలంతో చాలా ఈజీగా ముగ్గురిని గెలిపించుకుంటుంది. అదే టీడీపీ విషయం చూస్తే 22 మంది ఎంఎల్ఏలకు మరో 21 మంది ఎంఎల్ఏల మద్దతిస్తే కాని ఒక అభ్యర్ధిని గెలిపించుకునే అవకాశంలేదు.
ఇంతమంది ఎంఎల్ఏల మద్దతు కావాలంటే వైసీపీ నుండే లాక్కోవాలి. అన్నీ కోణాల్లో చూసిన తర్వాత అంతమందిని టీడీపీకి మద్దతుగా లాక్కోవటం తేలికకాదని అర్ధమైపోయిందట. ఆ మధ్య ఎంఎల్సీ ఎన్నికల్లో అవసరమైన నలుగురు ఎంఎల్ఏల ఓట్లను లాక్కున్నంత ఈజీకాదు 21 మంది ఎంఎల్ఏల ఓట్లను లాక్కోవటం అని తీర్మానించుకున్నారట. బలంలేనపుడు పోటీలోకి దింపటం ఎందుకులే అని సీనియర్ తమ్ముళ్ళు చంద్రబాబునాయుడుతో చెప్పారట. అందుకనే టీడీపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ఎక్కడా కనబడటం లేదు.
This post was last modified on February 13, 2024 10:49 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…