Political News

ఎన్నికకు టీడీపీ దూరమేనా ?

తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకపుడు టీడీపీ తరపున ఎస్సీ సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత వర్ల కాదు కంభంపాటి రామ్మోహన్ రావు పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఇపుడేమో అసలు టీడీపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి కనబడటం లేదు. నామినేషన్ల దాఖలకు 15వ తేదీ ఆఖరు.

వైసీపీ తరపున పోటీ చేయబోతున్న గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డికి జగన్మోహన్ రెడ్డి బీ ఫారాలను అందించారు. ఈరోజే రేపో వీళ్ళు నామినేషన్లు వేయబోతున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు వేరే ఎవరు నామినేషన్లు వేయకపోతే వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లే. వైసీపీ తరపున ముగ్గురిని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేట్లు చేయలానే ప్రశ్న టీడీపీలో బలంగా వినబడుతోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పోటీ పెట్టేందుకు అవసరమైన ఓట్ల బలం లేదు.

ఇపుడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 174. ఇందులో వైసీపీ తరపున 151 మంది ఉంటే టీడీపీ తరపున 22 మందే ఉన్నారు. తాజా సంఖ్యా బలాన్ని బట్టి ప్రతి రాజ్యసభ ఎంపీకి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. వైసీపీ తరపున పోటీచేయబోతున్న ముగ్గురికి కలిసి 129 ఓట్లు అవసరం. వైసీపీకి ఉన్న బలంతో చాలా ఈజీగా ముగ్గురిని గెలిపించుకుంటుంది. అదే టీడీపీ విషయం చూస్తే 22 మంది ఎంఎల్ఏలకు మరో 21 మంది ఎంఎల్ఏల మద్దతిస్తే కాని ఒక అభ్యర్ధిని గెలిపించుకునే అవకాశంలేదు.

ఇంతమంది ఎంఎల్ఏల మద్దతు కావాలంటే వైసీపీ నుండే లాక్కోవాలి. అన్నీ కోణాల్లో చూసిన తర్వాత అంతమందిని టీడీపీకి మద్దతుగా లాక్కోవటం తేలికకాదని అర్ధమైపోయిందట. ఆ మధ్య ఎంఎల్సీ ఎన్నికల్లో అవసరమైన నలుగురు ఎంఎల్ఏల ఓట్లను లాక్కున్నంత ఈజీకాదు 21 మంది ఎంఎల్ఏల ఓట్లను లాక్కోవటం అని తీర్మానించుకున్నారట. బలంలేనపుడు పోటీలోకి దింపటం ఎందుకులే అని సీనియర్ తమ్ముళ్ళు చంద్రబాబునాయుడుతో చెప్పారట. అందుకనే టీడీపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి ఎక్కడా కనబడటం లేదు.

This post was last modified on February 13, 2024 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

24 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago