సూపర్ స్టార్ రజినీకాంత్ నట వారసత్వాన్ని కొనసాగించానికి కొడుకులు లేరు. కూతుళ్లకు నటన మీద కంటే దర్శకత్వం మీదే ఆసక్తి. ఐతే వాళ్ల కోసం కుటుంబ కథానాయకులు రిస్క్ చేసి మరీ సినిమాలు చేస్తున్నారు కానీ.. ఏదీ వర్కవుట్ కావడం లేదు. ముందుగా రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రాజేష్.. తన భర్త ధనుష్ను హీరోగా పెట్టి ‘3’ అనే సినిమా తీసింది.
కొలవెరి పాట కారణంగా ఈ సినిమా విడుదలకు ముందే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో ఇంకో సినిమా తీసింది. అది ఒక మోస్తరుగా ఆడింది. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య తన తండ్రినే ప్రధాన పాత్రలో పెట్టి ‘లాల్ సలాం’ తీసింది. ఇందులో రజినీది దాదాపు ముప్పావుగంట ఉండే పాత్ర. రజినీ సినిమా అంటే మామూలుగా హైప్ వేరే స్థాయిలో ఉంటుంది. కానీ టైటిల్ సహా ఏదీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడంతో రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ రాలేదు.
తెలుగులో అయితే రజినీ సినిమా రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. విడుదల తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘లాల్ సలాం’ వీకెండ్ కంటే ముందే వాషౌట్ అయిపోయింది. తమిళంలో ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. సినిమాకు లాంగ్ రన్ ఉండేలా కనిపించడం లేదు. అక్కడ కూడా సినిమా ఫ్లాప్గానే నిలిచేలా ఉంది.
రజినీకి చిన్న కూతురు సౌందర్యతోనూ చేదు అనుభవమే ఉంది. ఆమె ఆయన్ని హీరోగా పెట్టి ‘కోచ్చడయాన్’ అనే యానిమేషన్ మూవీ చేసింది. అది నిర్మాతలు, బయ్యర్లకు దారుణమైన నష్టాలు మిగిల్చింది. ఆమె ఆ తర్వాత తన బావ ధనుష్ను పెట్టి ‘వీఐపీ’ సీక్వెల్ తీసింది. అది కూడా నిరాశపరిచింది. మొత్తంగా రజినీ కూతుళ్ల దర్శకత్వ ఆశలేమో కానీ.. వాళ్ల సినిమాలను నమ్ముకున్న వాళ్లందరికీ దారుణమైన నష్టాలు తప్పట్లేదు.
This post was last modified on February 12, 2024 10:05 pm
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…