పెళ్లి కాని యువతీ యువకులకు ఫిబ్రవరి 14 అంటే ఒక స్పెషల్ ఎమోషన్. వాలెంటైన్ డేగా ప్రపంచం మొత్తం ఎంత సంబరంగా జరుపుకుంటుందో, ఎంత ఆనందంగా లవ్ జంటలు రోజంతా గడుపుతాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. కేవలం పార్కులకు, రెస్టారెంట్లకే కాదు థియేటర్లకు వచ్చేలా పాత సినిమాల వర్షం కురిపించబోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సిద్దార్థ్ – షామిలి జంటగా నటించిన ‘ఓయ్’ని ఆ రోజు రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్లాప్ అయినా సరే దీనికి ప్రత్యేక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతంలో వచ్చిన పాటలు యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేశాయి.
కొన్ని నెలల క్రితం వచ్చి హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఇచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ని ఇంకోసారి తెరమీదకు తెస్తున్నారు. గౌతమ్ మీనన్ మాయాజాలంలో తడిసేందుకే ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ హైదరాబాద్ బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది బ్లాక్ బస్టర్ ‘సీతారామం’ని ప్రత్యేక ప్రీమియర్లకు రెడీ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై. మొహబ్బతే లాంటి క్లాసిక్స్ ని యష్ రాజ్ ఫిలింస్ అందిస్తోంది. నేనేం తక్కువా అంటూ ఎవర్ గ్రీన్ ‘టైటానిక్’ కూడా జనాలను పలకరించబోతోంది.
కొత్త సినిమాలే నాలుగైదు రిలీజవుతున్న వారంలో ఒకేసారి ఇన్ని ఓల్డ్ క్లాసిక్స్ మూకుమ్మడిగా దాడి చేయడం విచిత్రం. కొత్త తమిళ డబ్బింగ్ ట్రూ లవర్ సైతం కేవలం లవర్స్ డే సెంటిమెంట్ ని నమ్ముకునే బరిలో దిగుతోంది. సో ఒకటి రెండు కాదు బోలెడు ఆప్షన్లు ప్రేమికుల కోసం రెడీ అవుతున్నాయి. కాకపోతే ఏకాంతంగా సమయం గడపాలంటే మాత్రం వీటిలో తక్కువ బుకింగ్స్ జరిగే వాటిని లవర్స్ ఎంచుకుంటారని వేరే చెప్పాలా. ఒక్క ఫిబ్రవరి 14న కానుకల రూపంలో ఇచ్చేందుకు జరిగే బిజినెస్ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. గిఫ్ట్ షాపులు కిటకిటలాడుతాయి. ఈసారి వీటికి థియేటర్లు తోడవుతాయి.
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…