ఎన్నో ఆశలు, అంచనాలు.. వాటన్నింటినీ నీరుగార్చేసింది వి సినిమా. ఇదేమీ చెత్త సినిమా కాదు కానీ.. కాంబినేషన్ క్రేజ్, ప్రోమోల ఆధారంగా పెట్టుకున్న అంచనాలకు మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. కొన్ని వారాల పాటు చర్చల్లో ఉండేది. కానీ టాక్ భిన్నంగా ఉండటంతో చర్చ కూడా నెమ్మదించింది.
ఇక అందరి దృష్టీ ఓటీటీలో రిలీజయ్యే తర్వాతి పేరున్న తెలుగు సినిమా ఏది అనే విషయం మీదికి మళ్లింది. తర్వాత ఏ సినిమా వచ్చినా.. దానిపై వి తాలూకు ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏది అన్నది ఇప్పుడు ప్రశ్న.
మార్చి నెలాఖర్లో వి విడుదల కాగానే దాని వెనుకే ఉప్పెన, రెడ్ సినిమాలు రావాల్సింది. వాటికి అప్పుడే ఫస్ట్ కాపీలు రెడీ అయిపోయాయి. అయితే ఉప్పెన మెగాస్టార్ చిన్న మేనల్లుడి అరంగేట్ర సినిమా కాబట్టి ఓటీటీ రిలీజ్ వద్దనుకుంటున్నారు.
రామ్ రెడ్ సినిమాకు ఆల్రెడీ వేరే మార్గాల్లో పెట్టుబడి వెనక్కి రావడంతో ఓటీటీ రిలీజ్ విషయంలో వెనుకంజ వేస్తున్నారట. కాగా నిశ్శబ్దం, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు ఓటీటీ విడుదలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సోలో బ్రతుకే సో బెటర్కు సంబంధించి ఇంకా కొంత వర్క్ మిగిలుందట.
నిశ్శబ్దం పని మాత్రం పూర్తయినట్లు, ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు సమాచారం. ఈ మధ్య ఇచ్చిన సంకేతాల ప్రకారం ఓటీటీ రిలీజ్కు ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఓటీటీ రిలీజ్ల విషయంలో వి తాలూకు నెగెటివిటీ కొంచెం తగ్గే వరకు చూసి ఈ నెలాఖర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇంకా కీర్తి సురేష్ సినిమాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి కూడా ఓటీటీ రిలీజ్కు సై అంటున్నాయి కానీ.. వాటి డీల్స్ తెగలేదని, కొంత పని కూడా మిగిలుందని అవి ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…