ఎన్నో ఆశలు, అంచనాలు.. వాటన్నింటినీ నీరుగార్చేసింది వి సినిమా. ఇదేమీ చెత్త సినిమా కాదు కానీ.. కాంబినేషన్ క్రేజ్, ప్రోమోల ఆధారంగా పెట్టుకున్న అంచనాలకు మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. కొన్ని వారాల పాటు చర్చల్లో ఉండేది. కానీ టాక్ భిన్నంగా ఉండటంతో చర్చ కూడా నెమ్మదించింది.
ఇక అందరి దృష్టీ ఓటీటీలో రిలీజయ్యే తర్వాతి పేరున్న తెలుగు సినిమా ఏది అనే విషయం మీదికి మళ్లింది. తర్వాత ఏ సినిమా వచ్చినా.. దానిపై వి తాలూకు ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏది అన్నది ఇప్పుడు ప్రశ్న.
మార్చి నెలాఖర్లో వి విడుదల కాగానే దాని వెనుకే ఉప్పెన, రెడ్ సినిమాలు రావాల్సింది. వాటికి అప్పుడే ఫస్ట్ కాపీలు రెడీ అయిపోయాయి. అయితే ఉప్పెన మెగాస్టార్ చిన్న మేనల్లుడి అరంగేట్ర సినిమా కాబట్టి ఓటీటీ రిలీజ్ వద్దనుకుంటున్నారు.
రామ్ రెడ్ సినిమాకు ఆల్రెడీ వేరే మార్గాల్లో పెట్టుబడి వెనక్కి రావడంతో ఓటీటీ రిలీజ్ విషయంలో వెనుకంజ వేస్తున్నారట. కాగా నిశ్శబ్దం, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు ఓటీటీ విడుదలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సోలో బ్రతుకే సో బెటర్కు సంబంధించి ఇంకా కొంత వర్క్ మిగిలుందట.
నిశ్శబ్దం పని మాత్రం పూర్తయినట్లు, ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు సమాచారం. ఈ మధ్య ఇచ్చిన సంకేతాల ప్రకారం ఓటీటీ రిలీజ్కు ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఓటీటీ రిలీజ్ల విషయంలో వి తాలూకు నెగెటివిటీ కొంచెం తగ్గే వరకు చూసి ఈ నెలాఖర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇంకా కీర్తి సురేష్ సినిమాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి కూడా ఓటీటీ రిలీజ్కు సై అంటున్నాయి కానీ.. వాటి డీల్స్ తెగలేదని, కొంత పని కూడా మిగిలుందని అవి ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.
This post was last modified on September 8, 2020 11:50 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…