ఎన్నో ఆశలు, అంచనాలు.. వాటన్నింటినీ నీరుగార్చేసింది వి సినిమా. ఇదేమీ చెత్త సినిమా కాదు కానీ.. కాంబినేషన్ క్రేజ్, ప్రోమోల ఆధారంగా పెట్టుకున్న అంచనాలకు మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. కొన్ని వారాల పాటు చర్చల్లో ఉండేది. కానీ టాక్ భిన్నంగా ఉండటంతో చర్చ కూడా నెమ్మదించింది.
ఇక అందరి దృష్టీ ఓటీటీలో రిలీజయ్యే తర్వాతి పేరున్న తెలుగు సినిమా ఏది అనే విషయం మీదికి మళ్లింది. తర్వాత ఏ సినిమా వచ్చినా.. దానిపై వి తాలూకు ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏది అన్నది ఇప్పుడు ప్రశ్న.
మార్చి నెలాఖర్లో వి విడుదల కాగానే దాని వెనుకే ఉప్పెన, రెడ్ సినిమాలు రావాల్సింది. వాటికి అప్పుడే ఫస్ట్ కాపీలు రెడీ అయిపోయాయి. అయితే ఉప్పెన మెగాస్టార్ చిన్న మేనల్లుడి అరంగేట్ర సినిమా కాబట్టి ఓటీటీ రిలీజ్ వద్దనుకుంటున్నారు.
రామ్ రెడ్ సినిమాకు ఆల్రెడీ వేరే మార్గాల్లో పెట్టుబడి వెనక్కి రావడంతో ఓటీటీ రిలీజ్ విషయంలో వెనుకంజ వేస్తున్నారట. కాగా నిశ్శబ్దం, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు ఓటీటీ విడుదలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సోలో బ్రతుకే సో బెటర్కు సంబంధించి ఇంకా కొంత వర్క్ మిగిలుందట.
నిశ్శబ్దం పని మాత్రం పూర్తయినట్లు, ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు సమాచారం. ఈ మధ్య ఇచ్చిన సంకేతాల ప్రకారం ఓటీటీ రిలీజ్కు ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఓటీటీ రిలీజ్ల విషయంలో వి తాలూకు నెగెటివిటీ కొంచెం తగ్గే వరకు చూసి ఈ నెలాఖర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇంకా కీర్తి సురేష్ సినిమాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి కూడా ఓటీటీ రిలీజ్కు సై అంటున్నాయి కానీ.. వాటి డీల్స్ తెగలేదని, కొంత పని కూడా మిగిలుందని అవి ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.
This post was last modified on September 8, 2020 11:50 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…