మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు సైడ్ తక్కువ ధరకు భోజనాలు అమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఏకంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని టాక్ వచ్చిందో అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక పక్కన ఇదే బిజినెస్ చేస్తున్న ఇతర స్త్రీలు తాము పడుతున్న అగచాట్లను చెప్పుకుంటున్న వైనం వీడియోల రూపంలో చక్కర్లు కొడుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ మొదలుకానుంది.
డిజిటల్ వర్గాల కథనం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. ఫేమ్ పేరుతో ఆవిడ బాల్యం నుంచి మొదలుపెట్టి, ఏపీ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితుల వరకు, అవమానాలు, ఎదుగుదల అన్నీ ఇందులో చూపిస్తారట. ఇది కార్యరూపం దాల్చాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. ఒప్పుకుంటే మాత్రం కళ్ళు చెదిరే మొత్తం నెట్ ఫ్లిక్స్ నుంచి రెమ్యునరేషన్ గా అందుతుంది. మాములుగా క్రైమ్ స్టోరీస్ మీద ఎక్కువ డాక్యు సిరీస్ లు తీసే ఈ ఓటిటి కళ్ళు కుమారి ఆంటీ మీద పడటం విశేషమే.
దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఖరారుగా చెప్పలేం. ఇప్పటికే బిబిసి ప్రతినిధులు కలిసి వెళ్లినట్టు సమాచారం. ఒక ముఖ్యమంత్రినే నీ హోటల్ కు వస్తాను అని చెప్పే దాకా వ్యవహారం వెళ్లిందంటే కుమారి ఆంటీ హోటల్ మాములు వైరల్ కాలేదు. రెండు లివర్స్ ఎక్స్ ట్రా వెయ్యి రూపాయలంటూ ఒక మీమర్ సరదాగా చేసిన వీడియో ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇదే నిజం. ఈ హడావుడి వల్ల జనాల తాకిడి విపరీతంగా పెరిగింది కానీ బిజినెస్ ఇంకా ఆ స్థాయిలో లేదంట. తినడానికి వచ్చినవాళ్ళ కంటే ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్న వాళ్లే ఎక్కువ.
This post was last modified on February 5, 2024 4:43 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…