మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు సైడ్ తక్కువ ధరకు భోజనాలు అమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఏకంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని టాక్ వచ్చిందో అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక పక్కన ఇదే బిజినెస్ చేస్తున్న ఇతర స్త్రీలు తాము పడుతున్న అగచాట్లను చెప్పుకుంటున్న వైనం వీడియోల రూపంలో చక్కర్లు కొడుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ మొదలుకానుంది.
డిజిటల్ వర్గాల కథనం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. ఫేమ్ పేరుతో ఆవిడ బాల్యం నుంచి మొదలుపెట్టి, ఏపీ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితుల వరకు, అవమానాలు, ఎదుగుదల అన్నీ ఇందులో చూపిస్తారట. ఇది కార్యరూపం దాల్చాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. ఒప్పుకుంటే మాత్రం కళ్ళు చెదిరే మొత్తం నెట్ ఫ్లిక్స్ నుంచి రెమ్యునరేషన్ గా అందుతుంది. మాములుగా క్రైమ్ స్టోరీస్ మీద ఎక్కువ డాక్యు సిరీస్ లు తీసే ఈ ఓటిటి కళ్ళు కుమారి ఆంటీ మీద పడటం విశేషమే.
దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఖరారుగా చెప్పలేం. ఇప్పటికే బిబిసి ప్రతినిధులు కలిసి వెళ్లినట్టు సమాచారం. ఒక ముఖ్యమంత్రినే నీ హోటల్ కు వస్తాను అని చెప్పే దాకా వ్యవహారం వెళ్లిందంటే కుమారి ఆంటీ హోటల్ మాములు వైరల్ కాలేదు. రెండు లివర్స్ ఎక్స్ ట్రా వెయ్యి రూపాయలంటూ ఒక మీమర్ సరదాగా చేసిన వీడియో ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇదే నిజం. ఈ హడావుడి వల్ల జనాల తాకిడి విపరీతంగా పెరిగింది కానీ బిజినెస్ ఇంకా ఆ స్థాయిలో లేదంట. తినడానికి వచ్చినవాళ్ళ కంటే ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్న వాళ్లే ఎక్కువ.
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…