మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు సైడ్ తక్కువ ధరకు భోజనాలు అమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఏకంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని టాక్ వచ్చిందో అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక పక్కన ఇదే బిజినెస్ చేస్తున్న ఇతర స్త్రీలు తాము పడుతున్న అగచాట్లను చెప్పుకుంటున్న వైనం వీడియోల రూపంలో చక్కర్లు కొడుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ మొదలుకానుంది.
డిజిటల్ వర్గాల కథనం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. ఫేమ్ పేరుతో ఆవిడ బాల్యం నుంచి మొదలుపెట్టి, ఏపీ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితుల వరకు, అవమానాలు, ఎదుగుదల అన్నీ ఇందులో చూపిస్తారట. ఇది కార్యరూపం దాల్చాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. ఒప్పుకుంటే మాత్రం కళ్ళు చెదిరే మొత్తం నెట్ ఫ్లిక్స్ నుంచి రెమ్యునరేషన్ గా అందుతుంది. మాములుగా క్రైమ్ స్టోరీస్ మీద ఎక్కువ డాక్యు సిరీస్ లు తీసే ఈ ఓటిటి కళ్ళు కుమారి ఆంటీ మీద పడటం విశేషమే.
దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఖరారుగా చెప్పలేం. ఇప్పటికే బిబిసి ప్రతినిధులు కలిసి వెళ్లినట్టు సమాచారం. ఒక ముఖ్యమంత్రినే నీ హోటల్ కు వస్తాను అని చెప్పే దాకా వ్యవహారం వెళ్లిందంటే కుమారి ఆంటీ హోటల్ మాములు వైరల్ కాలేదు. రెండు లివర్స్ ఎక్స్ ట్రా వెయ్యి రూపాయలంటూ ఒక మీమర్ సరదాగా చేసిన వీడియో ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇదే నిజం. ఈ హడావుడి వల్ల జనాల తాకిడి విపరీతంగా పెరిగింది కానీ బిజినెస్ ఇంకా ఆ స్థాయిలో లేదంట. తినడానికి వచ్చినవాళ్ళ కంటే ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్న వాళ్లే ఎక్కువ.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…