Movie News

ఈగల్ సంగీత దర్శకుడి గుట్టు తెలిసింది

రవితేజ లాంటి స్టార్ హీరో సినిమా అంటే టెక్నీషియన్లు అందరూ పేరున్న వాళ్లనే పెట్టుకుంటారు సాధారణంగా. కనీసం ఒక్క పేరున్న సినిమా అయినా చేసిన అనుభవం ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకుంటారు. ఐతే మాస్ రాజా కొత్త సినిమా ‘ఈగల్’ పోస్టర్ మీద మాత్రం సంగీత దర్శకుడిగా డేవ్ జాంద్ అనే పేరు చూసి అందరూ షాకయ్యారు. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని పేరిది. అతను ఎవరో ఏంటో.. తన నేపథ్యం ఏంటో తెలియదు.

నేరుగా ‘ఈగల్’ లాంటి పెద్ద సినిమాలోకి వచ్చేశాడు. ‘ఈగల్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాను కలిశాడు డేవ్ జాంద్. ఇంతకీ తన నేపథ్యమేంటో.. అతను ‘ఈగల్’లో ఎలా భాగం అయ్యాడో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను పదో తరగతి నుంచే పియానో, డ్రమ్స్, గిటార్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సొంతంగానే సంగీతం నేర్చుకున్నా. ఫ్రీలాన్స్ మ్యుజీషియన్‌గా పని చేయడం మొదలుపెట్టా. సోనీ ఇంటర్నేషనల్ గేమ్స్‌కి, ఇంకొన్ని భారతీయ షోలకు సంగీతం అందించా. హీరో శ్రీ విష్ణు, నేను కలిసి చదువుకున్నాం. తన వల్లే సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పరిచయం అయ్యాడు. అతను రాసుకున్న స్క్రిప్టులకు తగ్గట్లుగా ముందే సంగీతం సమకూర్చేవాడిని. తనతో ట్రావెల్ అవుతుండగానే రవితేజ గారితో ‘ఈగల్’ ఖరారైంది. రవితేజగారి సినిమా అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందుబాటులో ఉంటారు.

కానీ నేను ఈ కథ కోసం రెడీ చేసిన మూడు ట్రాక్స్ కార్తీక్‌కు నచ్చడం, అవి రవితేజ గారు విని ఓకే చేయడంతో నన్నే సంగీత దర్శకుడిగా ఖాయం చేశారు. ఈ సినిమాలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. అవి కొత్తగా ఉంటాయి. కార్తీక్‌తోనే ఇంకో సినిమా కూడా చేస్తున్నా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రానికి కూడా నేనే సంగీత దర్శకుడిని’’ అని డేవ్ జాంద్ తెలిపాడు.

This post was last modified on February 2, 2024 5:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

9 seconds ago

బాలయ్య వస్తే మీకే మంచిది అంటున్న రాజా సాబ్ డైరెక్టర్

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

15 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

21 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

28 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

48 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago