రవితేజ లాంటి స్టార్ హీరో సినిమా అంటే టెక్నీషియన్లు అందరూ పేరున్న వాళ్లనే పెట్టుకుంటారు సాధారణంగా. కనీసం ఒక్క పేరున్న సినిమా అయినా చేసిన అనుభవం ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకుంటారు. ఐతే మాస్ రాజా కొత్త సినిమా ‘ఈగల్’ పోస్టర్ మీద మాత్రం సంగీత దర్శకుడిగా డేవ్ జాంద్ అనే పేరు చూసి అందరూ షాకయ్యారు. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని పేరిది. అతను ఎవరో ఏంటో.. తన నేపథ్యం ఏంటో తెలియదు.
నేరుగా ‘ఈగల్’ లాంటి పెద్ద సినిమాలోకి వచ్చేశాడు. ‘ఈగల్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాను కలిశాడు డేవ్ జాంద్. ఇంతకీ తన నేపథ్యమేంటో.. అతను ‘ఈగల్’లో ఎలా భాగం అయ్యాడో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నేను పదో తరగతి నుంచే పియానో, డ్రమ్స్, గిటార్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సొంతంగానే సంగీతం నేర్చుకున్నా. ఫ్రీలాన్స్ మ్యుజీషియన్గా పని చేయడం మొదలుపెట్టా. సోనీ ఇంటర్నేషనల్ గేమ్స్కి, ఇంకొన్ని భారతీయ షోలకు సంగీతం అందించా. హీరో శ్రీ విష్ణు, నేను కలిసి చదువుకున్నాం. తన వల్లే సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పరిచయం అయ్యాడు. అతను రాసుకున్న స్క్రిప్టులకు తగ్గట్లుగా ముందే సంగీతం సమకూర్చేవాడిని. తనతో ట్రావెల్ అవుతుండగానే రవితేజ గారితో ‘ఈగల్’ ఖరారైంది. రవితేజగారి సినిమా అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందుబాటులో ఉంటారు.
కానీ నేను ఈ కథ కోసం రెడీ చేసిన మూడు ట్రాక్స్ కార్తీక్కు నచ్చడం, అవి రవితేజ గారు విని ఓకే చేయడంతో నన్నే సంగీత దర్శకుడిగా ఖాయం చేశారు. ఈ సినిమాలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. అవి కొత్తగా ఉంటాయి. కార్తీక్తోనే ఇంకో సినిమా కూడా చేస్తున్నా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రానికి కూడా నేనే సంగీత దర్శకుడిని’’ అని డేవ్ జాంద్ తెలిపాడు.
This post was last modified on February 2, 2024 5:36 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…